టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కింగ్ నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ అనుష్క శెట్టి. తోలి సినిమాతో ఆమెకు అంతగా పేరు రానప్పటికీ, మెల్లగా తనకు వచ్చిన అవకాశాలను ఒక్కొక్కటిగా సద్వినియోగం చేసుకున్న అనుష్క, నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా ఎదిగారు. ఇక ఆమె కెరీర్ లో ఇప్పటివరకు పలు విజయవంతమైన సినిమాల్లో నటించినప్పటికీ, 

ఆమెకు నటిగా గుర్తింపునిచ్చిన అరుంధతి సినిమాను ఆమె అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరనే చెప్పాలి. అప్పట్లో మల్లెమాల బ్యానర్ పై కోడిరామకృష్ణ దర్శకత్వంలో అద్భుతమైన హర్రర్ మరియు గ్రాఫికల్ వండర్ గా రూపొందిన ఆ సినిమా ఎన్నో రికార్డ్స్ ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం కొంత గ్యాప్ తరువాత అనుష్క నటిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ నిశ్శబ్దం. థ్రిల్లర్ సినిమాల దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మిస్తోంది సినిమా యూనిట్. కోన ఫిలిం కార్పొరేషన్, 

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఇక ఈ సినిమా కథ మరియు కథనాలు థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడిని ఎంతో థ్రిల్ చేయడం ఖాయమని, అలానే కెరీర్ పరంగా అనుష్కకు అరుంధతి తరువాత అంతకుమించిన స్థాయిలో ఈ సినిమా నిలుస్తుందని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇక నిన్నటితో సినిమా ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా అనుష్క నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.......!!


మరింత సమాచారం తెలుసుకోండి: