పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం తన గురువు రాం గోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ డైరక్టర్..మెగాస్టార్ తో 4 సార్లు సినిమా చేసే ఛాన్స్ వచ్చి మిస్ అయిన విషయాన్ని బయటపెట్టాడు. కానీ ఈసారి ఛాన్స్ ఇస్తే కచ్చితంగా నిరూపించుకుంటానంటున్నాడు పూరి. "చిరంజీవి 150వ సినిమాకు ముందు ఎంటర్ టైన్ మెంట్ స్టోరీ అనుకున్నాం. మళ్లీ ఆయన మనసు మార్చుకున్నారు. అయితేఇప్పటికే చిరంజీవి తో సినిమా చేద్దామని 4 సార్లు అనుకున్నాను. 

4 సార్లు మిస్ అయింది. దురదృష్టం ఏంటంటే.. అందులో 2 సార్లు పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి." అన్న సీక్రెట్ ని బయట పెట్టారు పూరి. ఇప్పటివరకు పూరి జగన్నాథ్, చిరంజీవి కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అంటే ఎవరికైనా ఆటోజానీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ పూరి ఒకసారి, రెండుసార్లు కాదు ఏకంగా 4సార్లు చిరంజీవితో సినిమా మిస్ అయిందని అసలు విషయం బయటపెట్టాడు. ఇప్పటికైనా చిరు ఒప్పుకుంటే 5 రోజుల్లో కథ రాస్తానని ధీమాగా చెప్తున్నాడు. చిరంజీవికి నేను పెద్ద ఫ్యాన్. ఆయనతోనే సినిమా చేయలేకపోతున్నాను. ఇప్పటికైనా చిరంజీవి ఒప్పుకుంటే 5 రోజుల్లో కథ రాస్తా. చిరంజీవికి కథ రాయడం పెద్ద సమస్యకాదు అంటున్నారు. 

మీరు 5 రోజుల్లో కథ రాస్తారు సరే అది చిరుకు నచ్చుతుందా..అనే కామెంట్ కూడా వెంటనే పడింది. అంతేకాదు సక్సెస్ లో ఉన్న దర్శకుడికే మహేష్ ఛాన్స్ ఇస్తాడంటూ వర్మ లాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మహేష్ అభిమానులతో చీవాట్లుతిన్నాడు పూరి జగన్నాథ్. నిజంగా మెగాస్టార్ ఛాన్స్ ఇస్తే పూరీ 5 రోజులు కాదు 25 రోజుల్లో కథ రాసినా ఎవరు అడగరు. కానీ కావాల్సింది మెగా స్టార్ కి మెగా ఫ్యాన్స్ కి పూరీ కి బ్లాక్ బస్టర్. అదెప్పుడిస్తారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: