బిగ్ బాస్ సీజన్ అలా మొదలైందో లేదో అప్పుడే గొడవలు కూడా మొదలయ్యాయి. ఆదివారం మొదలైన ఈ బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 3 నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. 15 మంది క్రేజీ సెలబ్రిటీస్ ను ఇంట్లోకి పంపించేశారు. ఇక మొదటిరోజు నుండే విభజించు పాలించు రూల్ ప్లే చేశాడు బిగ్ బాస్.


హౌజ్ లోకి మొదట వచ్చిన ముగ్గురు ఇంటి సభ్యులు శివ జ్యోతి, రవి కృష్ణ, అషు రెడ్డిలు ఆ తర్వాత వచ్చిన ఇంటి సభ్యుల నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టారు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రశ్నల ఆధారంగా ఈ ప్రక్రియ జరిగింది. అయితే దానిలో వారికి నచ్చని ఓ ఆరుగురు పేర్లు బిగ్ బాస్ చెప్పమని అనగా వీళ్లు ముగ్గురు ఆరుగురు పేర్లు చెప్పారు.    


అందులో బాబా భాస్కర్, జాఫర్, వరున్ సందేశ్, శ్రీముఖి, రాహుల్, వితిక ఉన్నారు. అయితే మెంటర్ గా హేమాను ఎంపిక చేయగా ఇప్పుడు ఆ మెంట సమక్షంలో ఈ ఆరుగురు బదులుగా మరో ఆరుగురిని నామినేషన్ కు ఎంపిక చెయ్యొచ్చు. అది కూడా బిగ్ బాస్ బజర్ మోగించిన వెంటనే వాళ్లని ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. 


ఇంట్లోకి వచ్చి ఒక్కరోజే అవడంతో ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్ అన్నది తెలియదు కాని వెంటనే గొడవ పెట్టే ప్లాన్ చేశాడు బిగ్ బాస్. మరి బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ వల్ల మొదటిరోజే గొడవ వాతావరణం ఏర్పడింది. రేపటి ఎపిసోడ్ లో కొందరు ఈ నామినేషన్ పై తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నట్టుగా కమింగ్ అప్ లో చూపించారు. మొత్తానికి మొదటిరోజు నుండే బిగ్ బాస్ బిగ్ గేం మొదలు పెట్టాడన్నమాట.
 


మరింత సమాచారం తెలుసుకోండి: