యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా టీమ్ ఫ్యాన్స్ కి ఏం కావాలో ఆ విషయాన్ని ఇన్ని రోజులకు తెలుసుకున్నారు. ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సూపర్ రొమాంటిక్ పోస్టర్ తో పాటే 30 ఆగస్టు విడుదల అంటూ డేట్ కన్ ఫర్మ్ చేసింది. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ లో ఉండటంతో ప్రేక్షకులకు సరైన అప్‌డేట్ ని ఇన్ని రోజులు ఇవ్వని చిత్ర బృందం ఈ సారీ పక్కా అప్‌డేట్ తో మంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయనే క్యూరియాసిటీని ఈ పోస్టర్ ద్వారా తెలిపారు.

పోస్టర్ లో ప్రభాస్-శ్రద్ధ లుక్స్ అభిమానులను అలరించేలా వున్నాయి. ఇన్నాళ్లు బైక్ లు, కార్లు, ఛేజింగ్ లు, హడావుడి తప్ప, స్టడీగా వున్న మంచి స్టిల్ రాలేదు. ఇప్పుడు ఈ స్టిల్ ఆ లోటు తీర్చేసింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొలిక్కి రావడంతో సాహో టీమ్ ఇప్పుడు పబ్లిసిటీ మీద దృష్టిపెట్టింది. ఇప్పటికే ఓ సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
మరో రెండు రోజుల్లో ఇంకో సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఆగస్టు రెండోవారంలో భారీ ప్రీరిలీజ్ ఫంక్షన్ వుంటుందని లేటెస్ట్ నూస్. ఇక ఈ సినిమాలో ఇంట్రవెల్ ముందు వచ్చే భారీ

యాక్షన్స్ సీన్ సినిమాకే హైలెట్ అవనుందని సమాచారం. అంతేకాదు ఆ భారీ యాక్షన్ సీన్ ని దాదాపు 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారని తెలిసిందే. మరి బాహుబలి తర్వాత వస్తున్న సాహో మీద ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. అందువల్ల ఎలాంటి రికార్డ్స్ ని క్రియోట్ చేస్తుందోనన్న ఆతృత ఫ్యాన్స్ లో బాగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: