తెలుగులో అర్జున్ రెడ్డి ఎటువంటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. అప్పటి దాకా వస్తున్న సినిమాలన్నింటి కంటే కొత్తగా వచ్చి ప్రేక్షకుల మతులు పోగొట్టింది. అఖండ విజయం సాధించి ఒక కల్ట్  క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగాకి చాలా పేరొచ్చింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కబీర్ సింగ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


కబీర్ సింగ్ సినిమాకి బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఎన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ కలెక్షన్ల మీద అవి ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి.  ౩౦౦ కోట్ల కలెక్షన్లు సాధించి షాహిద్ కపూర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కబీర్ సింగ్ గా షాహిద్ కనబరిచిన నటనకి మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమా విజయంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి బాలీవుడ్ నిర్మాతల నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయట.


బాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తుండటంతో సందీప్ వంగా... ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అతడికి హైదరాబాద్‌లో సొంతగా ఫ్లాట్ ఉంది. అయితే 'కబీర్ సింగ్' మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ ఉపయోగించుకుని బాలీవుడ్ ఎదగాలనే ప్లాన్లో ఉన్నారట.ఇటీవల ఆయన బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ... తనకు మరిన్ని హిందీ సినిమాలు చేసే ప్లాన్స్ ఉన్నాయి, ముంబైలో పెద్ద ఆఫీస్, ఇల్లు కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.


బాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఘనత గతంలో రామ్ గోపాల్ వర్మ సొంతం చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత ఇలాంటి హైప్ మళ్లీ సందీప్ రెడ్డి 'కబీర్ సింగ్' మూవీ ద్వారా సందీప్ సొంతం చేసుకున్నాడు. మరి సందీప్ కూడా రామ్ గోపాల్ వర్మ లాగా ముంబయిలోనే సెటిల్ అవుతాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: