ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై మంచి రేటింగ్స్ మరియు ఆడియన్స్ ట్రెమెండస్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న షోల్లో బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఇప్పటికే ప్రసారమైన బిగ్ బాస్ రెండు సీజన్లు మంచి సక్సెస్ ని అందుకోవడంతో, ఈ 3వ సీజన్ ను మరింత సక్సెస్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కొంత వెరైటీ గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఎంటర్ అయి రెండు రోజులు కావడం, అలానే వారిలో ఒక ఆరుగురు ఎలిమినేషన్ జోన్ లోకి రావడం జరిగిపోయాయి. 

అయితే ఈ షోలో అందరు కంటెస్టెంట్స్ కంటే యాంకర్ శ్రీముఖినే కొంత ఆకర్షణగా నిలుస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే యూత్, మరియు ఫ్యామిలీ లేడీస్ లో ఆమెకున్న ఫాలోవింగ్ అటువంటిది మరి. ఇక నిన్నటి షో తరువాత, ఒక్కొక్కరుగా అందరు పార్టిసిపెంట్ల వ్యక్తిగత అభిప్రాయాలూ మరియు ప్రవర్తన బయటపడుతున్నాయి. ఇక నిన్నటి రోజున షోలో ఎలిమినేషన్ జోన్లో ఉన్న శ్రీముఖి బదులుగా హిమజను మెంటర్ గా ఉన్న హేమ సెలెక్ట్ చేయడం జరిగింది. దానితో శ్రీముఖి సేఫ్ జోన్ లోకి వచ్చారు. అయితే శ్రీముఖి మొదట్లోనే ఎలిమినేషన్ జోన్ లోకి రావడంతో ఆమె ఫ్యాన్స్ కొందరు ఆగ్రహిస్తూ నిన్నటినుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ షోను జరగనివ్వం, 

అలానే ఆ షో తాలూకు సెట్ ని ముట్టడించి తగులబెడతాం అంటూ కామెంట్స్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. అయితే దీనిపై కొందరు విశ్లేషకులు స్పందిస్తూ, బిగ్ బాస్ షో అనేది కేవలం ఆట మాత్రమే, కాబట్టి శ్రీముఖి ఫ్యాన్స్ కూడా దానిని అట లానే చూడాలి, అంతేకాని ఆమె ఒకవేళ ఎలిమినేట్ అయితే షోని జరుగనివ్వం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని అంటున్నారు. ఇక నిన్నటి షోలో శ్రీముఖి సేఫ్ జోన్ లోకి రావడంతో ఆమె ఫ్యాన్స్ ఆగ్రహంతో ఒకింత ఖంగారుపడ్డ బిగ్ బాస్ యూనిట్, కొంత ఊపిరిపీల్చుకున్నట్లు సమాచారం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: