టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ కి తన గొంతు అందించిన ప్రముఖ నటులు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ ‘నువ్వే కావాలి’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.   ఈ సినిమా మంచి హిట్ అయ్యింది..కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ పెద్దగా హిట్ కాలేదు. దాంతో మంచ హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది ఈ మద్య ‘బుర్రకథ’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అది చెప్పుకోదగ్గ హిట్ కాలేదు. అయితే సినిమా కాన్సెప్ట్ బాగున్న జనాలకు మాత్రం పెద్దగా రిసీవ్ చేసుకోలేక పోయారు. 

తాజాగా యువ దర్శకుడు విశ్వనాథ్  దర్శకత్వంలో ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్ జంటగా 'జోడి' సినిమా నిర్మితమవుతోంది.  తాజాగా ఈ మూవీ నుంచి ఓ టీజర్ రిలీజ్ చేశారు.  ఇందులో హీరో హీరోయిన్ల పరిచయం చాలా రొమాంటిక్..ఫన్నీగా జరిగింది. మొదట గిల్లి కజ్జాలతో మొదలైన పరిచయం తర్వాత ప్రేమగా మారడం.. ప్రేమికులుగా తమదైన ప్రపంచంలో విహరించడం ఈ టీజర్ లో చూపించారు.

'జెర్సీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ చాలా సెక్సీగా, గ్లామర్ గా కనిపిస్తుంది.  సాయి వెంకటేశ్ - పద్మజ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, ఫణి కల్యాణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న ఆది సాయికుమార్ కి, ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: