అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ షోలో కంటెస్టెంట్స్ చేసే కామెడీ కంటే అనసూయ కోసమే చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తనదైన యాంకరింగ్‌తో గుర్తింపు పొందిన అనసూయ.. ఆ క్రేజ్‌తోనే వరుసగా సినిమా అవకాశాలను పట్టేస్తోంది. 


ప్రస్తుతం ఈ భామ ప్రధాన పాత్రలో ‘కథనం’ సినిమా త్వరలో విడుదల కానుంది. వరుస సినిమా ఆఫర్స్ పట్టేస్తున్న యాంకర్ అనసూయ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా వుంటూ తన వ్యక్తిగత సమాచారాన్ని అభిమానులకు తెలియజేస్తూనే ఉంటుంది. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఆమె ఎప్పుడూ హాట్ హాట్ గానే దర్శనమిస్తూ, ఎప్పటికప్పుడు తన భర్త, పిల్లలతో జాలీగా గడిపిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. ఐతే ఈ మధ్య ఎందుకు ఇంత తొందరగా పెళ్లిచేసుకున్నారు అనసూయ అంటూ కొందరు అభిమానులు అనసూయని ప్రశ్నించారు.


దీనికి సమాధానంగా తన ట్విటర్ ద్వారా స్పందించింది రంగమత్త .. వివరాలలోకి వెళితే .. మీరు ఎందుకంత తొందరగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాకుంటేనా మీరు టాప్ హీరోయిన్ అయిపోయేవారు. పైగా భర్త, పిల్లలతో దిగిన ఫొటోలు ఎందుకలా షేర్ చేస్తారు. అలా చేస్తే మీకున్న డిమాండ్ తగ్గుతుంది కదా అంటూ ఇటీవల అనసూయకు సోషమీడియా ద్వారా సలహాలిచారట కొందరు అభిమానులు. 


ఈ ప్రశ్నపై స్పందించిన అనసూయ జవాబుగా నా జీవితంలో పొందినవన్నీ, సాధించినవన్నీ అందరికీ చుపించాలనేదే నా భావన. అంతేగానీ ఏదో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నేనస్సలు సిగ్గు పడను. ఫీల్ కాను. నేను ఇప్పటివరకు పొందిన వాటన్నింటికంటే గొప్పది నా కుటుంబమే కదా. అలాంటి కుటుంబంతో ఆనందంగా గడిపిన క్షణాలు పంచుకోవడంలో సిగ్గెందుకు? అని పేర్కొంటూ భర్త, పిల్లలతో దిగిన పిక్ షేర్ చేసింది అనసూయ. ఈ మేరకు మై స్ట్రెంగ్త్ ఈజ్ మై ఫ్యామిలీ అని ట్యాగ్ చేసి కుటుంబమంటే తనకు ఎంత ఇష్టమో చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: