ఒకవైపు తెలుగు, తమిళంలో ఒక వెలుగు వెలుగుతున్న టైమ్‌లోనే బాలీవుడ్‌ వెళ్లి లక్‌ను పరీక్షించుకుంది. అక్కడ ఈ అమ్మడికి ఒరిగిందేమి లేదు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటించిన ‘మనం’ సినిమా శ్రియకు తెలుగులో మళ్లీ బిజీ అయ్యేలా చేసింది. 


ఆ తర్వాత వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల’లో ఒక హీరోయిన్‌గా నటించింది. మరోవైపు బాలయ్య నటించిన సెంచరీ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో మెయిన్‌ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాాత రష్యాకు చెందిన వ్యక్తితో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత బాలయ్య, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’లో ఒక నాయికగా నటించింది. అంతేకాదు ఆ తర్వాత బాలయ్య తన తండ్రిజీవితంపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో  చిన్న పాత్రలో నటించింది.


ప్రస్తుతం ఈ భామ సైమా అవార్డు ఫంక్షన్‌లో భాగంగా క్లీవేజ్ షోతో అలరించింది. అంతేకాదు ఈ సందర్భంగా ఆమె వైవాహిక జీవితంపై మీడియా అడిగిన క్వశ్చన్స్‌కు శ్రియ ఫైర్ అయినట్టు సమాచారం. తన పర్సనల్ విషయాలను మీడియాతో షేర్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిందట. అంతేకాదు ఇక ముందు తన భర్త, ఇంటి విషయాలను అడగొద్దని చెప్పినట్టు సమాచారం. ఏమైనా శ్రియ..మీడియా తన పర్సనల్ విషయాలు అడగటంపై ఎందుకంత రాద్దాంతం చేస్తుందో అని అందరు చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: