ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ సినిమాలకు మంచి గిరాకీ పెరిగిపోయింది. బాహుబలి నుండి టాలీవుడ్ సినిమా కథలు అంటే ఎగబడి పోతున్నారు మిగతా ఇండస్ట్రీకి చెందినవారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ పరంగా డౌన్ లో ఉన్న హీరోలు...తెలుగు సినిమా కథలను రీమేక్ చేస్తూ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం ఇటీవల కురిపిస్తున్నారు.


తాజాగా విజయ్ దేవరకొండ తెలుగులో నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ను కబీర్ సింగ్ గా రీమేక్ చేసి షాహిద్ కపూర్ అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఇటువంటి క్రమంలో తాజాగా న్యాచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై రీమేక్ చేయడానికి సిద్ధపడిన నేపథ్యంలో షాహిద్ కపూర్ ఈ సినిమాకి 40 కోట్లు అడిగినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.


దీంతో కబీర్ సింగ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, షాహిద్ అడిగినంత ఇవ్వడానికి కరణ్ ఓకే అన్నాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. మరోవైపు సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబి', డియర్ కామ్రేడ్ సినిమా రీమేక్ చేయడానికి కూడా కరణ్ సిద్ధపడుతున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: