మెగా హీరో సాయి ధరం తేజ్ తన కో యాక్టర్స్ తో చాలా సరదాగా ఉంటాడు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో తేజ్ చాలా క్లోజ్ గా ఉంటాడని టాక్ ఉంది. ఇక ఒకసారి కలిసి చేసిన హీరోయిన్ అయితే ఇక షూటింగ్ స్పాట్ లో ఆ హంగమా వేరేలా ఉంటుందట. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో సాయి ధరం తేజ్ హీరోగా వస్తున్న సినిమా ప్రతిరోజు పండుగే.


చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్న సాయి ధరం తేజ్ ఈసారి కూడా హిట్ టార్గెట్ తో ఈ సినిమా చేస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు సుప్రీం సినిమాలో కలిసి నటించారు. రెండోసారి జతకట్టడం కాబట్టి ఇద్దరు షూటింగ్ స్పాట్ లో అల్లరి చేస్తున్నారట.


వాళ్లిద్దరి క్లోజ్ నెస్ చూసి చిత్రయూనిట్ కు డౌట్ వచ్చేలా చేస్తున్నారట. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోగా సాయి ధరం తేజ్ సుప్రీం తర్వాత వరుసగా ఆరు ఫ్లాపులు ఫేజ్ చేశాడు. చిత్రలహరి జస్ట్ ఓకే అనిపించగా ప్రతిరోజు పండుగతో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. షూటింగ్ అంతా జాలీగా నడుస్తుందట.


ఇక మారుతి కూడా ఈ సినిమా మీద పత్యేక శ్రద్ధ వహిస్తున్నాడట. మహానుభావుడు తర్వాత మారుతి చేసిన శైలజా రెడ్డి అల్లుడు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు మారుతి. మినిమం గ్యారెంటీ డైరక్టర్ అనిపించుకున్న మారుతి సాయి ధరం తేజ్ తో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: