అమలా పాల్  ‘ఆమె’ విడుదలకు ముందే చాలా బజ్జ్ క్రెయేట్ చేసింది,  ట్రైలర్ విడుదలైనప్పుడు అమలా పాల్ ఒక గదిలో నగ్నంగా కూర్చున్న షాకింగ్ విజువల్ టాకింగ్ పాయింట్ అయింది. ఈ చిత్రం మంచి రివ్యూలను కూడా తెచ్చుకుంది.

అయితే బాక్సాఫీస్ వద్ద ‘ఆమె’ డీలా పడిపొయింది, ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, విడుదలై వారం అవ్తున్నా ఇంకా తేరుకోలేదు. తెలుగు డబ్బింగ్ వెర్షన్  నిర్మాతలలో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ దీనికి కారణం  తమిళ నిర్మాతలు అని అంటున్నారు . ఆర్థిక సమస్యల కారణంగా  ప్రకటించినట్లుగా ఈ

చిత్రం 19 న విడుదల కానందున, ఈ చిత్రం   డీలా పడిపొయింది అని అన్నారు.  ఇది తనకు మంచి గుణపాఠం అని ఆయన వెల్లడించారు. ఫిల్మ్ ఛాంబర్‌లో తమిళ నిర్మాతలపై ఫిర్యాదు చేస్తానని తమ్మారెడ్డి చేప్పారు.

ఈ చిత్రం తమిళంలో  విడుదల కావడానికి అమలా పాల్ తన సొంత డబ్బును తమిళనాట ఫైనాన్షియర్లకు చెల్లించారు.మరి ఇక్కడ ఎం జరుగుతుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: