తెలుగులో వస్తున్న కామెడీ షో లో ద బెస్ట్ కామెడీ షోగా ‘జబర్ధస్త్’కి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే.  ఈ కార్యక్రమం మొదలై ఇప్పటికే ఆరేళ్లు దాటింది.  జబర్ధస్త్ కామెడీ షో తో పరిచయం అయిన యాంకర్ అనసూయ కొద్ది కాలానికే బాగా పాపులర్ అయ్యింది.  ప్రస్తుతం ఆమె వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తూ బిజీ కావడమే కాదు సినీరంగంలోకి ప్రవేశించింది. 

ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలు మరోవైను టెలివిజన్ రంగంలో బిజీగా గడుపుతున్న అనసూయ తాజాగా ‘కథనం’ మూవీలో నటించింది. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజున అక్కినేని నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ కూడా విడుదల కాబోతోంది.

దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నేడు విడుదలైంది. ఈ సందర్భంగా అనసూయ ఓ వెరైటీ ట్విట్ చేసింది. ‘అసలు వీరికి నేను పోటీ ఏంటి? నా పిచ్చి కాకపోతే’ అని పేర్కొంది. అంతే కాదు, తాను తన సినిమాతో పాటు ‘మన్మథుడు 2’ కూడా చూస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

అంతే కాదు నాగ్ నటించిన ‘మన్మథుడు2’ట్రైలర్ చూశానని తనకు ఎంతోబాగా నచ్చిందని ఇందులో నాగ్ నిజంగానే నవ మన్మథుడుగా కనిపిస్తున్నాని కామెంట్ చేసింది.  తనకిష్టమైన నాగార్జున, రకుల్ ప్రీత్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్ సినిమాలో ఉన్నారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: