గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలతో అమాంతంగా హైలెవల్ కు వెల్లి పోయిన పవన్ కళ్యాణ్ జీరో లెవల్ కు పడిపోతున్నాడన్న సంకేతాలు తానే జారీ చేసుకున్నాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ లో ఆయన సమకాలీనులైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ వంటి వారెందరో ఓ సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమాలను చేతిలో పెట్టుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఆ పనిచేయకుండా ఆగిపోయాడట.

అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్న గబ్బర్ సింగ్ సీక్వెల్ తప్ప మరే సినిమాను పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదట. మరోవైపు ఆయన రాజకీయాల్లోకి వెలుతున్నాడు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నందున రాజకీయాల్లోకి వెలితే సినిమా షూటింగ్ లకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన భావించే ముందస్తు వ్యూహంలో భాగంగానే కొత్త సినిమాలకు ఒప్పుకోలేదన్న ప్రచారం జరుగుతోంది.

ఇక రాజకీయాలంటే ఎంత మంచి వ్యక్తులకైనా శతృవులు పుట్టుకొస్తారు, ఆయన సోదరుడు చిరంజీవి విషయంలోనే అది అందరికి అర్థమయింది. సినిమాల్లో మెగాస్టార్ గా వెలుగు వెలిగి అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న చిరంజీవి రాజకీయాల్లోకి వెల్లాక అదే అభిమానుల చేత ఛీకొట్టించుకుని జీరో లెవల్ కు పడిపోయినట్టే పవన్ పరిస్థితి కూడా కాదు కదా... అంటూ టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: