తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ షో ఐదో రోజు ఇంటి సభ్యుల మద్య మొదట వివాదం మొదలైంది.  తన భార్యకు సరైన గౌరవం ఇవ్వలేదని వరుణ్ సందేశ్ కమెడియన్ మహేష్ పై విరుచుకు పడ్డాడు.  అదే రీతిలో తన తప్పు లేకుండా తనపై అడ్డగోలుగా మాట్లాడటంపై సీరియస్ అయ్యాడు మహేష్ విట్టా.  వరుణ్ సందేశ్ - వితిక జంట, మహేష్ విట్టా మధ్య జరిగిన ఈ గొడవను సర్ధుబాటు చేయడానికి ఇంటి సభ్యులు నానా తంటాలు పడ్డారు.  కొద్ది సేపు ఎవరు తగ్గలేదు. చివరికి మహేష్ విట్టా కాస్త తగ్గి వరుణ్ సందేష్ ని హగ్ చేసుకొని సారీ అని చెప్పాడు. అయితే వరుణ్ సందేశ్ అయిష్టాంగానే హగ్ చేసుకున్నాడు.


తర్వాత బాబా మాస్టర్ బోజనం విషయంలో మరోసారి రాహూల్, అలీ వర్సెస్ శ్రీముఖి మద్య ఓ మోస్తారు గొడవ జరిగింది.  ఆయన భోజనం విషయం గురించి శ్రీముఖి ప్రస్తావించగా ఆయన భోజనం పక్కన పెడితే సరిపోతుంది..అంత మాత్రాన ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని  ఇంటి సభ్యులు ముక్తకంఠంతో చెప్పారు.  ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చారు.  బాబా మాస్టర్, శ్రీముఖి లకు ఫిలిమ్ ఇనిస్ట్యూట్ నడుపుతున్నట్లు వారికి కేటాయించిన సభ్యులతో బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా టాస్క్ చేయాలని చెప్పారు. 


దాంతో శ్రీముఖి, హేమ చేసి ఓవరాక్షన్ ఇబ్బంది అనిపించినా..మహేష్ విట్టా, బాబా భాస్కర్ చేసిన స్కిట్ హైలెట్ గా నిలిచింది.  వ్యవసాయం గురించి...వ్యవసాయ భూమిని కార్పోరేటర్లు ఎలా లాక్కుపోతున్నారని అచ్చమైన రైతు బిడ్డగా మహేష్ విట్టా అద్భుతంగా నటించాడు.  రంగా రంగా రంగస్థాలానా అని పాట పాడుతూ బాగా అలరించారు.  మొత్తానికి మహేష్ విట్టా ప్రదర్శన ఇంటి సభ్యులు కూడా ఖుషీ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: