ఓ బేబి సినిమా విజయంతో మంచి ఫామ్ లో ఉంది సమంత. ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించి తన నటనతో సినిమా మరో రేంజ్ కి తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే ఈ విజయంతో సమంత తన రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేంసిందట?. "ఓ బేబి" సినిమాకి రెండు కోట్లు తీసుకున్న సమంత ఇప్పుడు ఒక కోటి పెంచేసి మూడు కోట్లకి చేరింది.


తాజా రెమ్యునరేషన్ పెంపుతో సమంత అత్యధికంగా పారితోషికం తీసుకొనే అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. దక్షిణాదిలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్‌గా రెండో స్థానంలో నిలిచింది. సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకొనే వారిలో నయనతార ముందున్నారు. తాజా పెంపుతో నయనతారకు దగ్గరలో సమంత నిలిచింది.దక్షిణాదిలో ఇటీవల కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే వారిలో నయనతారకే అగ్రతాంబూలం. 


ప్రతీ సినిమాకు నయనతార రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. వరుస విజయాలు పలకరించడంతో మరింత పారితోషికాన్ని కూడా నయనతారకు పెంచుతున్నట్లు తెలుస్తున్నది.స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్‌ విషయంలో భారీగా వ్యత్యాసం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. అలాంటి వాటికి నయనతార, సమంత పారితోషికాలు సరిగానే సమాధానం చెప్పేలా ఉన్నాయనే మాట వినిపిస్తున్నది.


ఈ ఇద్దరు హీరోయిన్లు మిగితా యువ తారలకు ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నారు. ఇక ఓ బేబీ సినిమా తర్వాత, సమంత అక్కినేని మన్మథుడు 2 సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నది. నాగార్జున, రకుల్ ప్రీత్ నటిస్తున్న ఈ చిత్రానికి హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: