'బాహుబలి' తర్వాత రాజమౌళి ఏ సినిమా ప్రకటన చేస్తారో ...తెలుగులో చేస్తారో హిందీలో చేస్తారో ఏ భాషలో చేస్తారో అందరు ఆసక్తిగా దేశమంతా ఎదురు చూసింది. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో కలసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది. భారీ బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి rrr అనే వర్కింగ్ టైటిల్ పెట్టడం జరిగింది. ఆనాటి దేశం కోసం స్వాతంత్ర పోరాట తరహా కల్పిత కథ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా అల్లు సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారని ఈ సినిమా గురించి మీడియా సమావేశం పెట్టిన సందర్భంలో రాజమౌళి చెప్పడం జరిగింది.


అయితే ఆ తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెట్టి కొంతవరకు చిత్రీకరించిన తరువాత హీరో రామ్ చరణ్ కి మరియు మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ కి వరుసగా గాయాలవడంతో..సినిమా షూటింగ్ దాదాపు కొన్ని రోజులపాటు ఆపేయటం జరిగింది. అయితే ఆ షూటింగ్ చేసిన ప్రాంతాలు తమిళనాడు పూణే కావటంతో...అక్కడ షూటింగ్ చేస్తుంటే సినిమాకి ఏదో ఒక ఆటంకం వస్తున్న క్రమంలో రాజమౌళి టీం సినిమా షూటింగ్ ప్రదేశం మార్చుకోవాలని సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు ఫిలిం నగర్ లో కొత్తగా వార్తలు వినబడుతున్నాయి.


ముఖ్యంగా వర్షాకాలం అయిన నేపథ్యంలో పూణేలో వాతావరణం కూడా షూటింగ్ కి పెద్దగా అనుకూలంగా ఉండకపోవడంతో త్వరలోనే కొత్త షెడ్యూల్ మరో ప్రాంతాలలో రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. మరోపక్క ఎన్ని ఇబ్బందులు వచ్చినా వచ్చే సంవత్సరం జులై నెల ఆఖరికల్లా సినిమా రిలీజ్ చేయాలని నిర్మాత డివివి దానయ్య...రాజమౌళి పై ఒత్తిడి చేస్తున్నట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి



మరింత సమాచారం తెలుసుకోండి: