ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న చిత్రం  ‘సైరా నరసింహారెడ్డి’. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం శబ్ధాలయ స్టూడియోస్‌ లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన చిరు.. ఖాళీ దొరికినప్పుడల్లా డబ్బింగ్ చెప్తూ..  మొత్తానికి తన పార్ట్  డబ్బింగ్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.  అలాగే  ఆగష్టు మూడో వారం కల్లా   పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట.  మొత్తానికి  ఆగష్టు ఎండింగ్ లో కల్లా   సైరా ఫస్ట్ కాపీ వస్తోంది అన్నమాట. 


ఇక చిత్రాన్ని  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.  అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే.. రెండో వారం నుండి దసరా సెలవులు కూడా  తమ సినిమాకు కలిసొస్తాయని చిత్రబృందం ఆలోచిస్తోంది. అందుకే అక్టోబర్ 2ను ఫైనల్ చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో   సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. 


అయితే  అనుష్క  సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించనుందని గత కొన్ని రోజులు క్రితం  సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట.  అసలు ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయే లేదట. ఈ సినిమాలో అనుష్క పాత్ర  స్టోరీ టెల్లర్ గా ఉంటుందని తెలుస్తోంది.  ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.   


ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా  మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న చిత్రం  ‘సైరా నరసింహారెడ్డి’. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం శబ్ధాలయ స్టూడియోస్‌ లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన చిరు.. ఖాళీ దొరికినప్పుడల్లా డబ్బింగ్ చెప్తూ..  మొత్తానికి తన పార్ట్  డబ్బింగ్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.  అలాగే  ఆగష్టు మూడో వారం కల్లా   పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట.  మొత్తానికి  ఆగష్టు ఎండింగ్ లో కల్లా   సైరా ఫస్ట్ కాపీ వస్తోంది అన్నమాట. 


ఇక చిత్రాన్ని  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.  అక్టోబర్ 2న రిలీజ్ చేస్తే.. రెండో వారం నుండి దసరా సెలవులు కూడా  తమ సినిమాకు కలిసొస్తాయని చిత్రబృందం ఆలోచిస్తోంది. అందుకే అక్టోబర్ 2ను ఫైనల్ చేసింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో   సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. 


అయితే  అనుష్క  సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించనుందని గత కొన్ని రోజులు క్రితం  సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.  కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట.  అసలు ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయే లేదట. ఈ సినిమాలో అనుష్క పాత్ర  స్టోరీ టెల్లర్ గా ఉంటుందని తెలుస్తోంది.  ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. 


భారీ బడ్జెట్ తో  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: