కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని పూరి జగన్నాధ్ కు ఇటీవల రామ్ హీరోగా రిలీజైన ఇస్మార్ట్ శంకర్ మూవీ మంచి సక్సెస్ ని  అందించింది. అంతేకాదు ఈ సినిమా చూస్తే ఒకప్పటి పూరి మళ్ళి  ఫామ్ లోకి వచ్చినట్లే ఉందని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. ఇక మరోవైపు ఊహించిన దానికంటే ఇస్మార్ట్ సినిమా మరింత  అద్భుతంగా కలెక్షన్లు రాబడుతుండడంతో ఆ సినిమా టీమ్ మొత్తం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే దర్శకుడు పూరి మాత్రం లోలోపల కొంత మధనపడుతున్నట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

దానికి ముఖ్యకారణం లేకపోలేదట, ఇటీవల మహేష్ బాబు తనతో జనగణమన సినిమా విషయమై కథ విని, ఇప్పటివరకు ఏ విషయం చెప్పలేదని, అంతేకాక ఆయన కేవలం దర్శకులు హిట్స్ లో ఉంటేనే పిలుస్తారని సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వాదన మెల్లగా చిలికి చిలికి గాలి వానగా మారడం, ఆపై కొందరు ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం పూరీని తప్పుపట్టడంతో, చివరికి దానికి ఫుల్ స్టాప్ పెట్టారు పూరి. ఇక ఆ వాదనతోనే రాబోయే రోజుల్లో కొన్ని సమస్యలు వస్తాయని ఆయన భయపడుతున్నారట. వాస్తవానికి తన సినిమాలంటే ఎక్కువగా ఇష్టపడేది మహేష్ బాబు అభిమానులేనని ఇటీవల పూరి చెప్పకనే చెప్పారు, మరి మహేష్ పై షాకింగ్ కామెంట్స్ చేసి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన పూరి, ఇకపై రాబోయే రోజుల్లో తాను తీయబోయే సినిమాలకు వారి మద్దతు ఉండదేమో అని కొంత ఆందోళన చెందుతున్నారట. 

అంతేకాక కొందరు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా తనను తప్పుపట్టడంతో, తన సినిమాలపై దాని ప్రభావం ఉండొచ్చనేది అయన భయానికి కారణమట. అయితే ఈ విషయమై కొందరు సినిమా విశ్లేషకులు మాట్లాడుతూ, పూరి ఒకరకంగా మహేష్ గారిపై అటువంటి కామెంట్ చేయకుండా ఉండాల్సింది. మరి అయన ఏ ఉద్దేశంతో అలా కామెంట్ చేసారో తెలియదుగాని, దానివలన ఆయన సినిమాలకు రాబోయే రోజుల్లో కొంతమేర డ్యామేజీ జరిగే అవకాశం లేకపోలేదనేది వారు చెప్తున్న మాట.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: