ఇటీవల తెలుగు సినిమాల్లో వస్తున్న మార్పులను చూస్తుంటే ముచ్చటేస్తుంది. విభిన్నమైన కథాంశాలతో చాలా కొత్త కొత్త కథల్ని తెరెకెక్కిస్తున్నారు.మన సినిమాలకు బాలీవుడ్ లో ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. తెలుగులో విడుదల కూడా అవకముందే డియర్ కామ్రేడ్ సినిమా రీమేక్ రైట్స్ ని కొనుక్కున్నారంటే బాలీవుడ్ కన్ను మన మీద ఎంత ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా మరో సినిమా బాలీవుడ్ కి రీమేక్ వెళ్ళనుందట.


మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో “ఖైదీ నంబర్ 150” తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. యాక్షన్ చిత్రాల దర్శకుడు వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా, 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. చిరంజీవి 150వ చిత్రంగా వచ్చిన “ఖైదీ నంబర్ 150” లో డ్యూయల్ రోల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ  చిత్రం హిందీలో రీమేక్ కానుంది.



అక్షయ్ కుమార్ హీరోగా జగన్ శక్తి దర్శకత్వంలో “ఇక్కా” పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ విషయాన్నీ దర్శకుడు జగన్ శక్తి స్వయంగా ధృవీకరించారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన “మిషన్ మంగళ్” ఆగస్టు 15న విడుదల కానుండగా,మరో కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. “మిషన్ మంగళ్” సినిమా సమయంలోనే ఈ మూవీ గురించి చర్చలు జరపడం జరిగిందన్న జగన్ శక్తి అతి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాం అని అన్నారు.


ఖైదీ నంబర్ 150 తమిళ చిత్రం “కత్తి”కి తెలుగు రీమేక్. మురుగదాస్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా 2014లో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. గతంలో మురుగదాస్,విజయ్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ చిత్రాన్ని, అక్షయ్ హాలిడే పేరుతొ హిందీలో రీమేక్ చేసి విజయం అందుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: