కింగ్ నాగార్జున హీరోగా చిలసౌ ఫేమ్ రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో సూపర్ హిట్ మూవీ సీక్వల్ గా వస్తున్న సినిమా మన్మధుడు 2. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాదు సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ గా కీర్తి సురేష్, సమంతలు ఉన్నట్టు తెలుస్తుంది.       


ఆగష్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని గట్టి నమ్మకంగా చెబుతున్నారు నాగ్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జివి మీద నాగార్జున కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శివ టైంలో ఎలా ఉన్నాడో వర్మ ఇప్పుడు అలానే ఉన్నాడని అతనిలో ఎలాంటి మార్పులేదని చెప్పుకొచ్చారు.


అంతేకాదు శివ సినిమా తన మొదటి సినిమానే అయినా తనకు ఏం కావాలో ఆర్జివికి బాగా క్లారిటీ ఉంటుందని.. అందుకే సినిమా అంత పర్ఫెక్ట్ గా వచ్చిందని అన్నారు. శివ కథ చెప్పినప్పుడే తనకు సినిమా కనిపించిందని సినిమా విషయంలో ఆర్జివి క్లియర్ గా ఉంటాడని చెప్పారు నాగార్జున.


ఇక మన్మథుడు సినిమాకు మన్మథుడు 2కి మధ్య ఎలాంటి సంబంధం లేదని.. మన్మథుడు 2 ఆ సినిమాకు సీక్వల్ కాదని ఓ ఫ్రెంచ్ మూవీ లైన్ తో ఈ సినిమా కథ అల్లుకున్నామని చెప్పాడు నాగార్జున. సినిమా కథ కన్నా క్యారక్టరైజేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టామని.. మూవీలో అందరి క్యారక్టర్స్ ఆడియెన్స్ కు కొత్త అనుభూతిని ఇస్తాయని అంటునారు నాగార్జున. మరి మన్మథుడు సూపర్ హిట్ కాగా ఆ సినిమా టైటిల్ తో మన్మథుడు 2గా వస్తున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ ఇయర్ అక్కినేని ఫ్యామిలీకి వెరీ లక్కీగా ఉంది. మజిలీ, ఓ బేబీ సినిమాలు హిట్ అవగా నాగార్జున మన్మథుడు 2కూడా అదే హిట్ మేనియా కొనసాగించేలా ఉంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: