బిగ్ బాస్ సీజన్ 3 అసలు మజా మొదలైంది. తొలివారం పూర్తి కావడంతో పాటు.. ఎలిమినేషన్లో భాగంగా హేమ బిగ్ బాస్ హౌస్ ఔట్ అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి ఇన్ అయింది. హోస్ట్గా కింగ్ నాగార్జున చేస్తుండడంతో బుల్లితెర ప్రేక్షకుల్లోనే కాకుండా వెండితెర ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి ఏర్పడింది. తొలి వారంలో హేమను టార్గెట్ చేసి ఎలిమినేట్ చేస్తే.. ఆ తర్వాత అందరూ కలిసి శ్రీముఖిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.
ఇక శ్రీముఖి బిగ్బాస్లోకి రావడానికి నెల కిందటే ట్విట్టర్లో తనకు సపోర్ట్ చెయ్యమంటూ శ్రీముఖి ఆర్మీ పేరుతో క్యాంపెన్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ ఆర్మీ సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. శ్రీముఖి హౌస్ లోపల ఎలా హ్యాండిల్ చేసినా బయట మాత్రం శ్రీముఖి మంచి ఆర్మీనే సెట్ చేసుకుందని టాక్ ఉంది. నిజానికి సెకండ్ సీజన్ లో కౌశల్ ఆర్మీ పేరుతో జరిగిన రచ్చ.. అంతా ఇంతా కాదు.. ర్యాలీలు.. బెదిరింపులు.. చాలానే జరిగింది. ఇప్పుడు మూడో సీజన్ లోనూ అదే రచ్చ మొదలైంది. శ్రీముఖిని ఈ వారం ఎలిమినేషన్ లోకి పంపడంతో గోల గోల మొదలుపెట్టారు.
సెకెండ్ సీజన్లో కౌశల్ ఆర్మీ పేరుతో ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలో డెవలప్ అయ్యింది. ఆ షో ఫైనల్కి చేరేటప్పటికి... కౌశల్ ఆర్మీ భారీగా పెరిగింది. చివరకు కౌశల్ని విన్నర్ చెయ్యడంలో కౌశల్ ఆర్మీ సక్సెస్ అయ్యింది. అదే తర్హాలో ఇప్పుడు శ్రీముఖి ఓ రేంజ్లో బ్యాక్ ఎండ్ టీమ్ ఫేవరేట్గా సెట్ చేసుకుని బరిలోకి దిగింది. మిగిలిన ఇంటి సభ్యులు ఎవరూ కూడా బ్యాక్ ఎండ్ టీమ్తో ఈమెను బీట్ చేయలేకపోయారు. హౌస్లో ఆమెను ఎంత వ్యతిరేకిస్తున్నాబయట మాత్రం రెండు వారాలు కాకముందే ఆమెను గెలిపించాలని శ్రీముఖి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.