ఆర్.ఎక్స్.100 లో ప్రేక్షకులను తన గ్లామర్ తో, పర్ఫార్మెన్స్ తో బోల్డ్ గా నటించి బాగా ఆకట్టుకుంది పాయల్ రాజ్ పుత్. కార్తికేయకంటే పాయల్ కే ఈ సినిమా ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి పాయల్ ఏమాత్రం తగ్గకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకుంటోంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా రెడీ అయిపోతోంది. ఇప్పటికే వెంకీ మామ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన అలాగే మాస్ మహా రాజ రవి తేజ సరసన డిస్కోరాజా సినిమాలోను నటిస్తోంది. అంతేకాదు మరో యంగ్ హీరో నటిస్తున్న సినిమాలోను వేశ్య పాత్ర పోషిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్రావు’ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగతుంది. అయితే సినిమాలో దొంగతనం చేసే సన్నివేశాలు చాల బాగుంటాయని.. అలాగే టైగర్ నాగేశ్వరరావు పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే మంచి ఫన్ ఉంటుందని గజదొంగగా కామెడీ బాగా చేస్తాడని తెలుస్తోంది. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు 1980 –90 మధ్య స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు.

మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే అప్పటి విషయాలు ఎంతో ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాలో  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే పాయల్ రాజ్ ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాస్ కి ఈ సినిమా అయినా హిట్ ఇస్తోందేమో  చూడాలి. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ నటించిన రాక్షసుడు ఆగస్టు 2 న రిలీజ్ అవబోతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: