అర్జున్‌రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోను, కోలీవుడ్‌లోనూ విజయ్ దేవరకొండ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాని తమిళ, హిందీలోనూ రీమేక్ చేశారు. బాలీవుడ్‌లో అయితే కబీర్ సింగ్ గా రీమేక్ అయి బాక్సాఫీస్ ను ధడ ధడ లాడించింది. షాహిద్ కెరీర్ లోనే అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన సినిమాగా రికార్డ్ పొందింది. అందుకే విజయ్ దేవరకొండ నటించిన, నటించబోయే తెలుగు సినిమాలపై బాలీవుడ్ దర్శకనిర్మాతలు కర్చీఫ్ వేశారు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్‌ని బాలీవుడ్ టాప్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ రీమేక్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు కూడా. అంతేకాదు కరణ్ జోహార్ ఈ రీమేక్ విషయాన్ని విజయ్‌తో కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చూసి మరీ.. తెలుగులో రిలీజ్ కాక ముందే  ప్రకటించేశాడు.

అయితే విడుదలయ్యాక డియర్ కామ్రేడ్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ మిక్స్డ్ టాక్ తో డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ కూడా యావరేజ్ గా కనబడుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ పర్వాలేదనిపించినా సోమ, మంగళ వారాల్లో భారీ డ్రాప్ కనబడుతుంది. అంతేకాదు డియర్ కామ్రేడ్ ను ప్రదర్శిస్తున్న థియేటర్స్ కూడా అక్కడక్కడా ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. ఇక ఓవర్సీస్ లో అయితే డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు.

ఇక కరణ్ జోహార్ హిందీ రీమేక్ అనగానే ఆ సినిమాలో దఢక్ జంట జాన్వీ అండ్ ఇషాన్ కట్టర్ లు నటిస్తారని తెగ ప్రచారం జరిగింది. కానీ కరణ్ వాళ్లతో రీమేక్ కాదన్నాడు. ఇప్పుడు డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ చూసాక, టాక్ చూసాక కరణ్ జోహార్ ఇప్పుడు ఈ సినిమాని రీమేక్ చేసే ధైర్యం చేసేలా అనిపించడం లేదు. ఇక్కడే నాలుగు భాషల్లో అతంతమాత్రంగా ఉన్న డియర్ కామ్రేడ్ టాక్ అండ్ కలెక్షన్స్ హిందీలో రీమేక్ చేస్తే మాత్రం వస్తాయా..అంటూ భయపడుతున్నారట. దీన్ని బట్టి చూస్తే కరణ్ డియర్ కామ్రేడ్ రీమేక్ చేస్తాడా? లేదంటే కేవలం డబ్బింగ్ చేసి ఊరుకుంటాడా అని బాలీవుడ్ లోనే కాదు ఇటు టాలీవుడ్ లోనూ చాలా మంది చెప్పుకుంటున్నారట. ఏదేమైనా విజయ్ కి డియర్ కామ్రేడ్ గట్టి షాకే ఇచ్చిందనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: