చిరంజీవి ప్రస్తుతం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. సైరా కోసం బరువుతో పాటు గడ్డం కూడా పెంచిన ఈయన ఇప్పుడు నీట్ షేవ్‌లోకి వచ్చేసాడు. చాలా రోజుల నుంచి చిరు కొత్త లుక్‌లోనే కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే సైరా పనులన్నీ పూర్తి చేసాడు చిరంజీవి. ప్రస్తుతం ఈయన ఫోకస్ మొత్తం కొరటాల శివ సినిమాపైనే ఉంది. 


ఈ సినిమా కోసమే ఇప్పుడు హోమ్ వర్క్ చేస్తున్నాడు చిరు. ఈ చిత్ర కథ ప్రకారం మెగాస్టార్ బరువు తగ్గాల్సిందే. దానికోసం కృత్రిమ పద్దతిలో కాకుండా ఆయుర్వేదాన్ని నమ్ముకుంటున్నాడు చిరు. ఇప్పుడు కొరటాల సినిమా కోసమే ఈయన ప్రత్యేకంగా కేరళ వెళ్తున్నాడని తెలుస్తుంది. 


గతంలో కూడా ఖైదీ నెం 150 సినిమా సమయంలో కేరళ వెళ్లొచ్చాడు చిరు. అక్కడే కొన్ని రోజులు ఉండి ఆయుర్వేద చికిత్స తీసుకుని వచ్చాడు. అప్పట్లో నాగార్జున దీన్ని చిరంజీవికి పరిచయం చేసాడని చెప్తారు ఇండస్ట్రీలో. బాగానే వర్కవుట్ కావడంతో అప్పట్నుంచి క్రమం తప్పకుండా చిరు కూడా కేరళ వెళ్లొస్తున్నాడు. ఇప్పుడు కూడా కొరటాల సినిమా కోసం బరువు తగ్గడానికి న్యాచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు మెగాస్టార్. కేరళ ఆయుర్వేదం పద్ధతులు ఫేమస్ అవ్వడం తో చాలా మంది సెలెబ్స్ ఇప్పుడు లైపోసక్షన్ బదులు ఇప్పుడు కేరళ పయనం అవుతున్నారు.


ఈ సినిమా అక్టోబర్‌లో పట్టాలెక్కనుంది. అప్పటి వరకు కచ్చితంగా కొత్త లుక్ తీసుకురానున్నాడు చిరంజీవి. ఈ చిత్రంలో కూడా నయనతార హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం జరుగుతుంది. సైరాలో ఈమెతోనే జోడీ కట్టాడు చిరంజీవి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఓపెనింగ్ జరగనుంది. మరి చూడాలిక.. కేరళ ఆయుర్వేదం చిరంజీవి లుక్‌ను ఎలా మార్చేయనుందో..? 


మరింత సమాచారం తెలుసుకోండి: