బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ రాక్షసుడు రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. కెరీర్లో సరైన కమర్షియల్ బ్రేక్ కోసం వెయిటింగ్లో ఉన్న శ్రీనివాస్ రమేష్వర్మ దర్శకత్వంలో ఈ సినిమా చేశాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఓ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే టాలీవుడ్ లో రాచ్చసన్ పేరుతో తెరకెక్కి హిట్ అవడంతో ఇక్కడ కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
టీనేజ్ గర్ల్స్ ని కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చే సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఇక సెన్సార్ కంప్లీట్ చేసుకున్న రారక్షసుడు సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. అలాగే రాక్షసుడు చిత్ర నిడివి 149 నిమిషాలని సర్టిఫికేట్ చుస్తే అర్థం అవుతుంది. దాదాపు రెండున్నర గంటలు సాగే ఉత్కంఠ రేపే సన్నివేశాలతో సినిమా తెరకెక్కింది.
మరి రెండున్నర గంటల పాటు బెల్లంకొండ ఏ రేంజులో టెన్షన్ పెడతాడో ? సినిమా ఎంత ఉత్కంఠతో నడుస్తుందనే దానిపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. సినిమా ఇప్పటికే తమిళ్లో హిట్ అయ్యి ఉండడం... అక్కడ కంటెంట్ను ఇక్కడ మక్కీకి మక్కీ దింపేయడం... ఆన్లైన్లో సినిమా చూసిన వారు కంటెంట్లో దమ్ముంది అని పాజిటివ్గా మాట్లాడుతుండడం రాక్షసుడికి కలిసి రానుంది. రేపు థియేటర్లలోకి దిగబోతోన్న ఈ సినిమాకు రూ.34 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా, రాజీవ్ కనకాల,శరవణన్,రాధా రవి,వినోద్ సాగర్ ఇతర కీలకపాత్రలలో నటిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.