కంగన రనౌత్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత గొప్ప నటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మొదటి సినిమా నుండి అందరి హీరోయిన్స్ లా రెగ్యులర్ సినిమాలు కాకుండా కథ కథనాలలో తన పాత్ర విషయంలో ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తు వస్తోంది. ఇక వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవిత కథ ఆధారంగా రూపొందించి తెరకెక్కించిన మణికర్ణిక బాలీవుడ్ లో మంచి వసూళ్ళను రాబట్టింది. అంతేకాదు స్టార్ హీరోలకు పోటీగా నటించి మరో సారి తన సత్తాను నిరూపించుకుంది. ఇక ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహించిన జడ్జ్ మెంటల్ హై క్యా కూడా బాలీవుడ్ లో సక్సస్ ఫుల్ గా రన్నవుతోంది. ఇదే జోరుమీదున్న కంగన మరో భారీ ప్రాజెక్ట్ లో నటించబోతోంది. 

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇక తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బయోపిక్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంగనా రనౌత్ ఈ సినిమా కోసం తమిళ్ కూడా నేర్చుకుందని కోలీవుడ్ మీడియా సమాచారం. 

ఇక కంగనా రనౌత్ ను రూపంలో కట్టు బొట్టు వ్యవహారాలలో అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ టీమ్ ఇండియాకు రానున్నారని లేటెస్ట్ న్యూస్. హాలీవుడ్ మూవీ 'డార్కెస్ట్ హవర్' కి మేకప్ మెన్ గా పనిచేసిన 'గ్యారీ ఓల్డ్ మెన్, 'అమ్మ' బయోపిక్ కూడా చెయ్యనున్నారు. ఇక అమ్మ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లతో రూపొందుతుంది. కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉందన్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. అందుకే ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఇక ఇదే బయోపిక్ ను సంచలన దర్శకుడు రాం గోపాల్ వరం కూడా తెరకెక్కించనున్నారు. కాకపోతే శశికళ నేపథ్యంలో రూపొందించనున్నారు. మరి ఎవరు అమ్మ గురించి వాస్తవాలను తెరపైకి తీసుకు వస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: