సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా మహర్షి సినిమా చేశాడి. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను అశ్వనిదత్, దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. మే 9న రిలీజైన ఈ సినిమా మహేష్ స్టామినా చూపించేలా కలక్షన్స్ అదరగొట్టింది.


ఈ సినిమా తర్వాత మహేష్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.


ఇక ఈ సినిమా తర్వాత మహేష్ అసలైతే త్రివిక్రంతో సినిమా చేయాల్సి ఉంది. అయితే మహేష్ మరోసారి వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మహర్షి టైంలోనే మహేష్ కు మరో సినిమా కథ వినిపించాడట వంశీ పైడిపల్లి. ఎలాగు మహర్షి సక్సెస్ అయ్యింది కాబట్టి వంశీతో మరో సినిమాకు లైన్ క్లియర్ చేశాడు మహేష్.  


ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే బడా నిర్మాణ సంస్థ నిర్మించడమే.. సోనీ నిర్మాణ సంస్థ మహేష్, వంశీ పైడిపల్లి సినిమా నిర్మించేందుకు ముందుకొస్తుందట. సోనీ సంస్థలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. సో అదే జరిగితే మరోసారి వంశీ, మహేష్ మరో సెన్సేషనల్ మూవీ చేసే అవకాశం ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమా పూర్తి కాగానే ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: