టాలీవుడ్ ప్రముఖ హీరో విశాల్ పై మరో వివాదం మొదలైంది. ఇప్పటికే ఆయన పై ఎన్నో కాంట్రవరసీలు వస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులో నడిఘర్ సంఘానికి ఆయన అధ్యక్షుడు అయినప్పటి నుంచి మొదలైన కష్టాలు ఇప్పటికీ వీడకుండా ఉన్నాయి. నడిఘర్ సంఘంలో విశాల్ వచ్చినప్పటి నుంచి చిత్ర పరిశ్రమపై ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, స్వార్థపూరిత చర్యలకు పాల్పపడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు ఆ మద్య చిన్న నిర్మాతల మండలి హీరో విశాల్ పై కేసులు కూడా పెట్టారు.
పెద్ద పెద్ద సినిమాలకే ఆయన థియేటర్లు ఉండేలా చేస్తున్నారని..దాని వల్ల చిన్న సినిమాలకు థియేటర్లు దొరకకుండా ఇబ్బింది అవుతుందని.. దాని వల్ల చిన్న నిర్మాతలు ఎన్నో నష్టాలకు గురి అవుతున్నారని వారు ఆరోపించారు. అంతే కాదు విశాల్ కార్యాలయానికి తాళం వేయడం..అది కాస్త విశాల్ అతని అనుచరులు పగలగొ్టడం ఉద్రిక్తత చోటు చేసుకోవడం..పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అంతే కాదు ఆయన ప్రేమ వ్యవహారం కూడా ఎంతో కాంట్రవర్సీతోనే ఉంది.
ప్రముఖ హీరో శరత్ కుమార్ తనయ వరలక్ష్మీ శరత్ కుమార్ తో ప్రేమాయణం కొనసాగించారని..తర్వాత విడిపోయారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ అమ్మాయితో విశాల్ ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ ప్రముఖ నటుడు విశాల్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తన ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల్లో మినహాయించిన పన్ను (టీడీఎస్)ను సక్రమంగా చెల్లించని కేసులో ఈ వారెంట్ జారీ అయింది.
గత కొంత కాలంగా విశాల్ టీడీఎస్ సక్రమంగా చెల్లించకపోవడంతో గతంలో ఆదాయపన్ను శాఖ అధికారులు విశాల్కు నోటీసులు పంపారు. అయితే ఆ నోటీసులకు విశాల్ స్పందించకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు ఆగస్టు 2న విచారణకు నేరుగా హాజరు కావాలంటూ విశాల్ను ఆదేశించింది. అయినప్పటికీ నిన్నటి విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు తీవ్రంగా పరిగణించింది. వాదనల అనంతరం విశాల్పై నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.