సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నాడు. భరత్ అనే నేను సినిమా తరువాత మహర్షి రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. అయితే మహేష్  మహర్షి సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నది. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు. దర్శకుడు అనిల్ రావిపూడి ఎంత స్పీడ్ గా  ఉన్నాడో ! నిజానికి మహర్షి  తరువాత మహేష్ సినిమా  సుకుమార్ తో ఉండాలి. సుకుమార్ కూడా మహేష్ కోసం ఒక స్టోరీ లైన్ వినిపించిన సంగతీ తెలిసిందే.


అయితే ఆ స్టోరీ లైన్ మహేష్ కు నచ్చకపోవడంతో ఆ సినిమాను పక్కన పెట్టేశారు. తరువాత సుకుమార్ వెంటనే అల్లు అర్జున్ తో సినిమాను ప్రకటించడం, తరువాత  మహేష్ — సుకుమార్ వివాదం కొన్ని రోజులు మీడియాలో రావటం అవన్నీ మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం మహేష్ .. అనిల్ రావిపూడి సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి వరుస హిట్స్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. f2 సినిమాతో అందరినీ ఎలా నవ్వించాడో మనం చుశాము. ఆ సినిమా తరువాత అనిల్ టాలెంట్ తెలుసుకున్న మహేష్ తన నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. దీనితో అనిల్ కు తక్కువ సినిమాలతోనే మహేష్ ను డైరెక్ట్ చేసే అవకాశం పొందాడు. 


అయితే లేటెస్ట్ గా ఈ సినిమా గురించి అనిల్ ట్విట్టర్ లో స్పందించారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ అయిపోయిందని రెండవ  షెడ్యూల్  ఫుల్ స్వింగ్ లో ఉందని చెప్పారు. ఇంకా ట్వీట్ చేస్తూ సంక్రాంతికి  ఒక హిలేరియస్ ట్రైన్ జర్నీ ని చూడబోతున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఒక సూపర్ స్టార్ సినిమా తీస్తున్న అనిల్, ఇలా ప్రతి విషయాన్ని లీక్ చేసి ట్విట్టర్ లో చెబుతుండటంతో సినిమా మీద ఉన్న క్యూరియాసిటీ పోతుందని మహేష్ అభిమానులు చెబుతున్నారు. అభిమానులు చెప్పింది కూడా నిజమే ఎందుకంటే పెద్ద హీరో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రతిది ఎంతో సీక్రెట్ గా ఉంచాలి. కానీ అనిల్ మాత్రం ఆనందంలో ఏది పడితే అది షేర్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: