జబర్ధస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన కార్యక్రమం.  బుల్లితెరపై జబర్ధస్త్ షో మొదలై ఆరు సంవత్సరాలు దాటుతున్నా దాని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.  కొత్త కొత్త స్కిట్స్ తో కడుపుబ్బా నవ్విస్తూ అందరి మన్ననలు పొందుతుంది.  అయితే బిగ్ బాస్ తో బాగా పాపులర్ అయిన నటులు వేణు, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లు జబర్ధస్త్ ని వీడారు.  వారి తర్వాత ఆ స్థాయిలో కామెడీ పండిస్తున్న వారిలో హైపర్ ఆది ఒకరు.  హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే అందరూ ఆసక్తితో చూస్తుంటారు. 

ఈయనకు తోడు రైజర్ రాజు కాంబినేషన్ చాలా బాగుంటుంది.  ఆ మద్య కొంత కాలం హైపర్ ఆది జబర్ధస్త్ లో కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. జబర్ధస్త్ నుంచి ఆదిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే జబర్ధస్త్ లో మంచి క్రేజ్ రావడంతో ఆదికి వెండి తెరపై కూడా మంచి అవకాశాలు రావడం వల్ల కొంత కాలం గ్యాప్ ఇచ్చినట్లు పలు సందర్భాల్లో తెలిపారు.  ప్రస్తుతం మళ్లీ జబర్ధస్త్ కామెడీ షోలో తన స్కిట్స్ తో అదరగొడుతున్నాడు ఆది.

జబర్ధస్త్ కామెడీ షోలో నటించే వారు నక్కతోక తొక్కినట్లు వరసగా స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం లభిస్తుంది.  ఈ మద్య ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ స్నేహితుడి జబర్ధస్త్ గెటప్ శీను అద్భుత నటన ప్రదర్శించాడు. తాజాగా ఇప్పుడు హైపర్ ఆదికి కూడా మంచి అవకాశం కలిసి వచ్చింది. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.  కాకినాడ షెడ్యూల్ లో హైప‌ర్ ఆది పాల్గొన్నాడ‌ట‌. త్రివిక్ర‌మ్ లాంటి పంచ్ ల‌తో జ‌బ‌ర్ద‌స్త్ లో న‌వ్వులు పండించే ఆదికి నిజంగా మంచి అవ‌కాశ‌మే అని చెప్పాలి.  ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం.  అయితే ఆదికి సంబంధించిన సన్నివేశాలు బాగా పేలితే మాత్రం మనోడు కి ఇక ఎదురే ఉండదని అంటున్నారు టాలీవుడ్ వర్గం.

ప్రస్తుతం స్టార్ కమెడియన్లు గా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహూల్ రామకృష్ణ ఫామ్ లో ఉన్నారు. వీరితో పాటు శ్రీనివాస్ రెడ్డి ఓ వైపు కమెడియన్ గా నటిస్తూనే హీరోగా కొనసాగుతున్నారు.  త్రివిక్రమ్ - బన్ని మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది.  గీతా ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని బేన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: