బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గత రెండేళ్ళుగా డిఫ్రెంట్ జోనర్స్ లో కథలను ఎంచుకొని వరుసగా హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. ఒక స్టార్ హీరో చేయాల్సిన కమర్షియల్ పంథాను పక్కన బెట్టి టాయిలెట్ ఏక్ ప్రేమ్మ్ కథ, కేసరి, ప్యాడ్ మ్యాన్ వంటి సామాజిక అంశాలున్న కథలతో మిగతా స్టార్ హీరోస్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. అంతేకాదు యం హీరోస్ కి చిన్న డోస్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు అక్షయ్ కుమార్. తన కెరీర్ ప్రారంభం నుంచి తన తోటి హీరోలతో విభిన్నమైన సినిమాలను చేస్తూ  వచ్చాడు. అలానే తను వ్యక్తిగతంగాను స్టార్ హీరో గా ఎదిగాడు. ఇప్పుడు కూడా చాలా మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తూ ఉన్నాడు. 'హౌస్ ఫుల్ 4', 'మిషన్ మంగళ్' ఆ తరహా భారీ మల్టీస్టారర్లే. హౌస్ ఫుల్ నాలుగో పార్ట్ లో అనేక మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు.

ఇక మిషన్ మంగళ్ పరిస్థితి కూడా అంతే. ఆ సినిమాలో ప్రముఖ నటీమణులు...విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, కృతి కుల్హారీ, నిత్యామీనన్, శర్మన్ జోషీ.. వంటి వాళ్లంతా కీలకపాత్రలు చేస్తున్నారు. అయితే వారందరి మధ్యన కూడా అక్షయ్ నటిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇది కేవలం అక్షయ్ లాంటి హీరోలకే సాధ్యమనిపిస్తుంది. అంతేకాదు తనకు అలాంటి పట్టింపులు లేవని అక్షయ్ అంటున్నాడు. తనకే ఫుల్ లెంగ్త్ రోల్ ఉండాలని తను అనుకోవడం లేదని మరోసారి క్లారిటి ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో. 

స్క్రిప్ట్ బాగుంటే మల్టీస్టారర్ సినిమాల్లో, తక్కువ వ్యవధి ఉండే పాత్రలో నటించడానికి అయిన తను రెడీ అని అక్షయ్ అంటున్నాడు. మరి ఈ బాలీవుడ్ స్టార్ హీరో ప్రకటన.. ఇమేజ్ అంటూ విర్రవీగే కొంతమంది కుర్ర హీరోలకు షాక్ ఇచ్చినట్టుంది!  నిజం చెప్పాలంటే ఇది వాస్తవమే. చాలామంది హీరో హీరోయిన్స్ కథ మొత్తం తమ చుట్టూనే తిరగాలని తమ క్యారెక్టర్ మాత్రమే హైలెట్ అవ్వాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో కొన్ని మంచి సినిమాలను ఒదులుకున్న సందర్భాలు బోలెడు. వాటన్నిటి అక్షయ్ మాటలు గొప్ప ఇన్స్పిరేషన్ గా అనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: