చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు రామ్ పోతినేని. వరుస ఫ్లాపులతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పెడుతున్న రామ్ కి డైరెక్టర్ పూరి జగన్నాథ్ అందించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా రామ్ కి మరో లైఫ్ ఇచ్చినట్లే. ఇదే క్రమంలో పూరి జగన్నాథ్ కూడా చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలో విజయాన్ని అందుకున్నాడు. సినిమా ఇంత విజయం సాధించడానికి అందరి కృషి ఉంది.


ఇటువంటి నేపథ్యంలో సినిమాలో హీరోయిన్లుగా నభ నటేష్, నిధి అగర్వాల్ నటించారు. అంతేకాకుండా సినిమాలో పూరి జగన్నాథ్ ఇద్దరి ముద్దుగుమ్మల అందచందాలను వెండితెరపై వేడెక్కించే ఈ విధంగా చూపించటంతో ఇద్దరు హీరోయిన్ల కోసం చాలామంది సినిమాకి మళ్లీ మళ్లీ వెళుతున్నారు. అయితే విషయం ఏమిటంటే సినిమా అదిరిపోయే హిట్ అవటంతో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్ సినిమా సక్సెస్ సంబరాలు చేస్తున్న క్రమంలో ప్రమోషన్లలో హీరోయిన్ నభ కన్నా ఎక్కువగా నిధి కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటంతో ఫిలిం నగర్ లో రకరకాల వార్తలు వినపడుతున్నాయి.


నిధి ఈ సినిమా లో మంచి పాత్ర పోషించిన నభ పాత్ర మాత్రమే ఇంపాక్ట్ క్రియేట్ చేయగల పాత్ర. అయితే నభ కన్నా ఇప్పుడు నిధి ఎక్కువ గా మీడియా లో కనిపిస్తూ ఉండటం వెనుక గల రహస్యం ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీంతో నభ తనకీ రావాల్సిన ఇంపార్టెన్స్ రావడం లేదు అని, అందుకే హర్ట్ అయి ఢిల్లీ వెళ్లిపోయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. మరోపక్క హీరో రామ్ చాలా కాలం తర్వాత తన కెరియర్ లో అదిరిపోయే మాస్ బ్లాక్ బస్టర్ పడటంతో...సినిమా సక్సెస్ సంబరాల్లో పాల్గొంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: