ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా హిట్ కేవలం పూరికి మాత్రమే కాదు రామ్ కు ఫుల్ జోష్ ఇచ్చింది. 75 కోట్ల గ్రాస్ తో రామ్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా ఇస్మార్ట్ శంకర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో రామ్ కెరియర్ మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.   


ఒకటి రెండు కథలు విన్నా ఓ తమిళ సినిమా రీమేక్ ఆలోచనలో ఉన్నాడట రామ్. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన తడం సినిమాపై రామ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. సినిమాలో హీరో డ్యుయల్ రోల్ చేశాడు. కథతో పాటుగా స్కీన్ ప్లే కూడా నచ్చడంతో రామ్ తెలుగులో ఆ సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నాడట.


స్రవంతి రవికిశోర్ నిర్మాణంలో కిశోర్ తిరుమల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ రామ్ తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశాడు కిశోర్ తిరుమల హ్యాట్రిక్ కాంబోగా ఈ సినిమా వస్తుంది. సాయి తేజ్ తో చిత్రలహరి సినిమా తర్వాత కిశోర్ తిరుమల మరోసారి రామ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.    


క్రేజీ కాంబోగా రాబోతున్న ఈ సినిమా గురించి మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. కరెక్ట్ సినిమా పడితే తన సత్తా ఏంటో చూపించాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ పూరి టేకింగ్ తో పాటుగా అతని నటన కూడా అందరిని సర్ ప్రైజ్ చేసింది. రామ్ కూడా ఇక నుండి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేలా ఉన్నాడు. కిశోర్ తో చేసే సినిమా రీమేక్ కాబట్టి తెలుగులో కూడా హిట్ పడినట్టే లెక్క.       



మరింత సమాచారం తెలుసుకోండి: