'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న 'సాహో' సినిమాపై దేశవ్యాప్తంగా భీభత్సమైన అంచనాలు ఉన్నాయి. 'బాహుబలి' క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమాని నాలుగు ప్రధాన భాషలో తెరకెక్కించారు డైరెక్టర్ సుజిత్. ప్రభాస్ కెరీర్లోనే దాదాపు మూడువందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధకపూర్ నటిస్తుంది. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ లాంటి వారు కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అద్భుతమైన సినిమా అని అంటున్నారు చాలామంది.


అంతేకాకుండా సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఫైట్ సీన్ల కోసం హాలీవుడ్ ఇండస్ట్రీ లో వర్క్ చేసిన ప్రొఫెషనల్స్ తో ఈ సినిమాలో వర్క్ చేయించినట్లు ఫిలింనగర్ టాక్. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న అలంకరణ విడుదల కాబోతున్న ఈ సినిమా మొట్టమొదటి షోరూం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ప్రదర్శించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా ఈనెల ఏడవ తారీఖున స్పెషల్ గా సినిమా యూనిట్ కోసం స్పెషల్ షో  ప్రదరించనున్నట్లు తెలుస్తోంది.ఇది కేవలం ట్రయల్ షో మాత్రమే.


సూళ్లూరు పేట పట్టణాన్నే ఎంచుకోవడానికి కారణం ఉంది. సూళ్లూరుపేటలో యువి క్రియేషన్స్ సంస్థ సొంత థియేటర్ నిర్మాణంలో ఉంది. తూర్పు దక్షణ ఆసియాలో అతిపెద్ద స్క్రీన్ తో నిర్మితమవుతున్న థియేటర్ ఇదే. ప్రస్తుతం థియేటర్ కి సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో సాహో లాంటి యాక్షన్ సినిమా ఇలాంటి స్క్రీన్ పై చూస్తే ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారని...సినిమా చూస్తున్నంత సేపు అనుభూతి చాలా బాగుంటుందని విజువల్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అలరిస్తాయని అంటున్నారు ఈ సినిమా నిర్మాణ రంగానికి చెందిన వాళ్ళు. 



మరింత సమాచారం తెలుసుకోండి: