టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక మరొక రెండు రోజుల్లో ఆయన జన్మదినం రానుండడంతో, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే ఊరూరా ఫ్లెక్సీలతో హడావుడి మొదలెట్టేసారు. ఇకపోతే మొన్న, మహేష్ బర్త్ డే కామన్ డిస్ప్లే పిక్చర్ ని సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ట్విట్టర్ లో ఆయన ఫ్యాన్స్ అతి పెద్ద ట్రెండ్ సృష్టించి 2 మిలియన్ల ట్వీట్స్ ని సాధించి అద్భుత రికార్డుని నెలకొల్పడం జరిగింది. ఇక మహేష్ బాబు సొంత థియేటర్ అయిన ఏఎంబి సినిమాస్, 

అలానే చెన్నైలోని మరొక థియేటర్ లో మహేష్ జన్మదినం నాడు ఆయన నటించిన బిజినెస్ మాన్, దూకుడు సినిమాల స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు. ఇక ఇటీవల మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని తయారు చేసిన మేడం టుస్సాడ్స్ వారు, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఫ్యాన్స్ కోసం ఒక అద్భుత ఆఫర్ ప్రకటించారు. అదేమిటంటే, మహేష్ ఫ్యాన్స్ ఎవరైనా సరే తమకు నచ్చిన విధంగా ఒక వీడియో బైట్ ద్వారా సూపర్ స్టార్ కు పుట్టిన రోజు విషెస్ ని కాస్త క్రియేటివిటీతో చెప్తూ, మేడం టుస్సాడ్స్ వారి ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, వంటి సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతూ వాటిని వారి హ్యాష్ ట్యాగ్ లతో పోస్ట్ చేయాలని, 

ఇక ఆ విధంగా పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా వీడియో బైట్స్ పంపిన వారినుండి ఒక అభిమానిని స్వయంగా మహేష్ బాబు చేతుల మీదుగా ఆయన జన్మదినం నాడు ఎంపికచేసి, వారిని ఫ్రీగా సింగపూర్ తీసుకువచ్చి మేడం టుస్సాడ్స్ లోని మహేష్ మైనపు విగ్రహం చూసేందుకు అవకాశం కల్పిస్తారట. ఇక ఈ ప్రకటన వెలువడిన దగ్గరనుండి మహేష్ ఫ్యాన్స్ విరివిగా తమ అభిమాన హీరో మైనపు విగ్రహాన్ని చూసేందకు అప్పుడే కాంటెస్ట్ లో వేలాదిగా పాల్గొంటున్నట్లు సమాచారం. మరి ఈ కాంటెస్ట్ లో విన్నర్ గా ఎవరు నిలిచి ఫ్రీగా సింగపూర్ చేరుకొని మేడం టుస్సాడ్స్ వారి ఆఫర్ ని గెలుచుకుంటారో తెలియాలంటే మాత్రం మరొక రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: