వరుసగా భారీ నిర్మాణ ప్రాజెక్టులు చేపడుతూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ తన కెరియర్ లో అద్భుతమైన బ్లాక్ బస్టర్ అయినా కమలహాసన్ నటించిన భారతీయుడు సీక్వెల్ చిత్రానికి శ్రీకారం చుట్టి కమలహాసన్ ని ఒప్పించి షూటింగ్ స్టార్ట్ చేసేసి భారతీయ సినిమా ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చారు. కమలహాసన్ కెరీర్లోనే చెప్పుకోదగ్గ సినిమాలలో ముందువరుసలో ఉండేది భారతీయుడు సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మ్యూజిక్ పరంగా స్టోరీ పరంగా అలాగే శంకర్ డైరెక్షన్ పరంగా అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డు లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టి ప్రభంజనం సృష్టించింది.


ఇటువంటి నేపథ్యంలో చాలా కాలం తర్వాత మళ్లీ ఆ సినిమా సీక్వెల్ శంకర్ డైరెక్షన్లో రావటంతో ప్రస్తుతం రాబోతున్న రిలీజ్ కాబోతున్న భారతీయుడు సీక్వెల్ పై తీవ్రమైన అంచనాలు పెట్టుకున్నారు సినిమా ప్రేక్షకులు. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో ఒకపక్క కమలహాసన్ రాజకీయాలు చేస్తూ షూటింగ్ కి అనేకసార్లు డుమ్మ కొట్టడంతో సినిమా అప్పట్లో సినిమా ఆగిపోయిందని ఇంకా రావడం కష్టమనే వార్తలు బాగా వినపడ్డాయి. అయితే తాజాగా కోళీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం.


ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కి ఎక్కడా కూడా బ్రేకులు పడకుండా పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్ ఇటీవల డైరెక్టర్ శంకర్ తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తి అయితే 2021 మార్చి 14న ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ కాబోతున్న మార్చి నెలతమిళులకు నూతన సంవత్సరం కావడంతో ఆ ఫెస్టివల్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ షూటింగ్ ని వచ్చే ఏడాది ఎండింగ్ లోనే పూర్తి చేయాలనీ శంకర్ డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: