టాలీవుడ్ లో ఎంతో మంది నట వారసులు ప్రస్తుతం హీరోలుగా రాణిస్తున్న సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ఏర్పాటు చేసుకొని వచ్చిన హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.  ‘హృదయకాలేయం’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన సంపూర్ణేష్ బాబు నిజంగానే బర్నింగ్ స్టార్ అనిపించుకున్నాడు.  తన పేరడీ డైలాగ్స్, కామెడీ పంచ్ లు, వెరైటీ డ్యాన్సులు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు వెండి తెరపై ఈ తరహా కామెడీ జోనర్ లో ఎవరూ రాలేదు.  దాంతో సంపూర్ణేష్ పై తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అభిమానం ఏర్పడింది.

హృదయకాలేయం సినిమా తర్వాత సింగం 123 లో హీరోగా నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు నటిస్తున్న ‘కొబ్బరిమట్ట’ ఈ నెల 10 న రిలీజ్ కాబోతుంది. వాస్తవానికి ఈ మూవీ గత రెండు సంవత్సరాల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.  కాకపోతే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్.. టీజర్లు ప్రేక్షకులను బాగా అలరించాయి.  ఈ మూవీ 10 ని రిలీజ్ కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ బిజీలో మునిగిపోయారు. 

లిరికల్ సాంగ్స్ తో పాటు తాజాగా కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు.  తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో కనిపించాడు.  అంతే కాదు ఆ మద్య పవన్ కళ్యాన్ విషయంలో సెన్సేషన్ సృస్టించిన క్రిటిక్ కత్తిమహేష్ పై వచ్చిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.  సంపూ తండ్రిగా .. షకీలా భర్తగా కత్తి మహేశ్ కనిపిస్తాడు.  ట్రైలర్ లో కత్తి మహేశ్ ను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. 

కత్తి మహేశ్ ఫొటో పట్టుకుని షకీలా ఏడుస్తూ ఉండటాన్ని చూసిన లాయర్ ఎవరమ్మా ఆయన 'చనిపోయారా' అని అడుగుతాడు. అందుకు షకీలా "అయ్యో లేదండి .. ఎక్కడ పడితే అక్కడ .. ఏది పడితే అది వాగుతున్నాడనీ పోలీసులు నగర బహిష్కరణ చేశారు" అని ఏడుస్తూ బదులిస్తుంది. ఈ డైలాగ్ చూసిన ప్రతి ఒక్కరూ గతంలో మహేష్ పై నిజంగానే బహిష్కరణ విషయం గుర్తుకు వచ్చి పడీ పడీ నవ్వుతున్నారు. అంతే కాదు షకీలా ఆయనకు బాణం ఉంది కానీ పదును లేదమ్మ.. ఏమండీ మీ చెట పప్పులో పడుతుందంటే.. ఇడ్లీలో చెండు చెంచాల ఉప్పు తగ్గించు, అసలే మనం పేదవాళ్లం అనే డైలాగ్స్ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: