సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కెరీర్ పరంగా ఆయన 26వ సినిమాగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ పై టోటల్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న విషయం తెలిసిందే. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే పలు ప్రాంతాల నుండి అద్భుతమైన బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్నట్లు సమాచారం. ఇకపోతే రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు 44వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఫ్యాన్స్ మూడు రోజులు ముందు నుండే పలు విధాలుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో సంబరాలు మొదలెట్టారు. 

ఇకపోతే రేపటి మహేష్ జన్మదినం సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు అని కొద్దిరోజులుగా విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ, ఆ సినిమా నిర్మాతలు మరియు దర్శకుడు అనిల్ రావిపూడి, తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ, మేజర్ అజయ్ కృష్ణ రేపు ఉదయం 9 గం. 9 ని. లకు రిపోర్టింగ్ స్టార్ట్ చేస్తారు అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ పై ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ పోస్ట్ లు అలా రాగానే, వాటిని సూపర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విపరీతంగా లైక్స్, షేర్స్ తో హోరెత్తిస్తున్నారు. 

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో రెండవ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు కెమెరా మాన్ గా పని చేస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గానటిస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: