తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికీ రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారం ఎండింగ్ కి వస్తుంది. మొదటి నుంచి బిగ్ బాస్ 3 ఎన్నో వివాదాలను మూటగట్టుకుంటుంది. మొత్తానికి బుల్లితెరపై కనువిందు చేస్తుంది. అయితే ఇంట్లోకి వచ్చిన ఇంటి సభ్యుల్లో మొదటి నుంచి గందరగోళం నడుస్తుంది. అందరూ సన్నిహితంగానే కనిపిస్తున్నా ఎవరి గేమ్ వారు చాలా సేఫ్ గా ఆడుతున్నారని మొదట ఎలిమినేషన్ అయిన నటి హేమ చెప్పింది. తాను కేవలం కిచన్ విషయంలో కాస్త కేర్ తీసుకున్నంత మాత్రాన తనను విలన్ గా ట్రీట్ చేశారని..అందుకే తనను బ్యాడ్ గా నామినేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక రెండో వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ప్రముఖ జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి జాఫర్ చాలా కూల్ గా ఉంటున్నారని..ఎంట్రటైన్ మెంట్ ఆయన వల్ల కావడం లేదని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఒటింగ్ కూడా చాలా తక్కువ పడటంతో ఆయన ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడో వారం ఎలిమినేషన్ లో ఇద్దరి పేర్లు మాత్రం చాలా సీరియస్ గా వినిపిస్తున్నాయి.
తమన్నా సింహాద్రి, శ్రీముఖి వీరిద్దరూ బిగ్ బాస్ హౌజ్ లో కొద్ది రోజులుగా రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. టాస్క్లు, గేమ్స్తో హౌస్లో కంటెస్టెంట్ల మధ్య ప్రతిసారి వాగ్వాదం చోటు చేసుకుంటోంది. చిన్న చిన్న విషయాలకు కూడా వారు గొడవలకు దిగుతూ హౌస్లో కాకపుట్టిస్తున్నారు. ప్రస్తుతం మూడో వారంలో ట్రాన్స్ జెండర్ తమన్నా – పునర్నవి – రాహుల్ – బాబా మాస్టర్ – వితికలు ఎలిమినేషన్లో ఉన్నారు.
మొన్న బిగ్ బాస్ ఇచ్చిన దొంగా పోలీస్ టాస్క్ లో గాజు పెట్టెలోని డబ్బులను కొట్టేయడానికి శ్రీముఖి డంబెల్తో వచ్చి గాజు గ్లాస్ను పగలకొట్టడం.. ఆ అద్దాలు కాస్తా రవికృష్ణ చేతికి తగిలి రక్తం కారడంతో ఇంటి సభ్యులు ఒక్కసారే ఆవేదర చెందారు. ఇలాంటి టాస్క్ లో నువు గెలవడానికి ఇతరులు ఏమైనా పరవాలేదా అంటూ అందరూ ఒక్కసారే సీరియస్ అయ్యారు. అంతే కాదు బిగ్ బాస్ ఈ ఇష్యూను సీరియస్గా తీసుకున్నాడు. దీనికి శిక్షగా ఆమెను వచ్చేవారం ఎలిమినేషన్ కి నేరుగా నామినేట్ చేశాడు.