మహేష్ బాబు తనకు ఇష్టమైన ఆట క్రికెట్ అని గతంలో వరల్డ్ కప్పు ఫైనల్ మ్యాచ్ ముంబై లో తిలకించడం జరిగిందని అంతగా క్రికెట్ అంటే తనకు ఇష్టమని ఒకానొక సందర్భంలో మీడియా ముందు తెలపడం జరిగింది. ఇదే క్రమంలో గతంలో చెన్నైలో ఉన్న సమయంలో క్రికెట్ ఎక్కువగా ఆడేవాడిని అంటూ క్రికెట్ పై తన ప్రేమను బయటపెట్టారు మహేష్. ఇదే క్రమంలో ఇటీవల 'మహర్షి' సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సమ్మర్లో 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లి కుటుంబంతో పాటుగా తన ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ వెళ్ళిన మహేష్ బాబు ఇంగ్లాండ్ లో జరిగిన ఆస్ట్రేలియా భారత్ క్రికెట్ మ్యాచ్ ను తిలకించి ఆ సమయంలో మైదానంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేశారు.

Image result for mahesh babu played cricket in shooting

ఇదిలా ఉండగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ జవాన్ పాత్రలో నటిస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల కాశ్మీర్లో కొంత పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటువంటి తరుణంలో షూటింగ్లో బయటకు వచ్చిన సమయంలో మహేష్ బాబు క్రికెట్ ఆడుతూ సినిమా యూనిట్ సభ్యులకు హుషారు తెప్పిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో మహేష్ బాబు షూటింగ్ బ్రేక్ లో ఆడుతున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Image result for mahesh babu played cricket in shooting

తాజాగా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సరిలేరు నీకెవరు' సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఒక వీడియో ని విడుదల చేయడం జరిగింది. ఆర్మీ మేజర్ లుక్కుతో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది . దాదాపు ఇప్పటికే 90 లక్షల మందికి పైగా ఈ వీడియో చూసినట్లు సమాచారం. వచ్చే సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: