టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ సాహో ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, అత్యధిక వ్యూస్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా రూపొందుతున్న ఈ సినిమాకు దాదాపుగా రూ.350 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమా కథను దర్శకుడు సుజిత్ తనకు చెప్పినపుడు తాము భారీగానే ఖర్చు అవుతుంది అనుకున్నాం అని, అయితే రాను రాను అది మరింతగా పెరిగి, ప్రస్తుతం మరింత భారీ స్థాయికి చేరిందని, అయితే రేపు థియేటర్ లో ఆడియన్స్  సినిమా చూసిన తరువాత ఈ సినిమాకు ఇంతటి భారీ ఖర్చు అవసరం అని అంటారని ప్రభాస్ చెప్పారు. 

ఇకపోతే నేడు ట్రైలర్ విడుదల సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో ముచ్చటించిన సాహో యూనిట్ సభ్యులు, ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని, అయితే రేపు రిలీజ్ తరువాత ఆ అంచనాలు తప్పకుండా అందుకుంటాం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ని చూసిన మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శక ధీరుడు రాజమౌళి తనకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడడం జరిగిందని ప్రభాస్ అన్నారు. తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు, ట్రైలర్ లోని ఆ లావిష్ సీన్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ తో తాను ఎంతో థ్రిల్ అయ్యానని మెగాస్టార్ మరీ మరీ అన్నట్లు ప్రభాస్ చెప్పారు. 

ఇకపోతే రాజమౌళి కూడా, బాహుబలి తరువాత తప్పకుండా అంతటి గొప్ప సక్సెస్ ని అందుకునే స్థాయి సినిమాగా సాహో తప్పక నిలుస్తుందని అన్నారని, ఆ విధంగా ఇద్దరు టాలీవుడ్ ప్రముఖులు తమ సినిమా ట్రైలర్ పై పొగడ్తలు కురిపించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రభాస్ అన్నారు. ఇక ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం కొన్ని నెలల పాటు ఎంతో శిక్షణ తీసుకుని మరీ చిత్రీకరించడం జరిగిందని, అందుకే టీజర్ విడుదల సమయంలో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అనే ట్యాగ్ ని వేయడం జరిగిందని, రేపు సినిమాకు వచ్చే ప్రేక్షకులు తప్పకుండా ఎంతో థ్రిల్ అవుతారని నిర్మాతలు అంటున్నారు. మరి ప్రస్తుతం విపరీతమైన అంచనాలు ఉన్న ఈ సినిమా రేపు రిలీజ్ తరువాత ఎంతటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: