ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. మరియు బాలీవుడ్ నిర్మాతలు మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి 'రామాయణ' అనే భారీ బడ్జెట్ సినిమాను నిర్మించనున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో 'రామాయణ' రానున్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖులు నటించనున్నారని, ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అల్లు అరవింద్ ప్రధాన నిర్మాత కాబట్టి మెగా కాంపౌండ్ హీరోలు ఎవరైనా సినిమాలో ఉంటారా అనే సందేహం వ్యక్తమవుతోంది ప్రేక్షకుల్లో. ఎందుకంటే మెగా కాంపౌండ్లో పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆశ ఉన్న నటులున్నారు. పైగా రామాయణం అంటే బోలెడన్ని పాత్రలుంటాయి. వాటికి ఎక్కువమంది నటులే అవసరమవుతారు. కాబట్టి మెగా హీరోలు కూడా కొందరు సినిమాలో నటించవచ్చేమోనని అనుకుంటున్నారు చాలామంది. మరి వాళ్ళు అనుకుంటున్నట్టు మెగా హీరోలు సినిమాలో నటిస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
అయితే ఈ రామాయణంలో ఎంతో కీలకమైన రావణుడు పాత్రను ఎవరు పోషించనున్నారో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. కాగా రావణుడి పాత్రకి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేస్తాడని జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్ర చెయ్యాలని ఇప్పటికే చాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏమైనా ఈ తరంలో హిస్టారికల్ పాత్రలు చేయాలంటే ఒక్క ఎన్టీఆరే గుర్తుకురావడం నిజంగా విశేషమే. ఎలాగూ పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆశ ఉన్న హీరోలు తక్కువుగా ఉన్నారు. అందుకే తారక్ పైనే అందరి చూపులు ఉన్నాయి. నిజంగా ఈ జనరేషన్ లో ఇలాంటి హిస్టారికల్ పాత్రలు చెయ్యటానికి గల సామర్ధ్యం ఒక్క ఎన్టీఆర్ లానే ఎక్కువుగా కనిపిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా మూడు భాగాలుగా ఉండనుంది. అది కూడా త్రీడీ ఫార్మాట్లో కావడం విశేషం. మొదటి భాగాన్ని 2021 నాటికి ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నారు నిర్మాతలు.