మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ సినిమాపై ప్రేక్షకులలో అభిమానులలో భీభత్సమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే వరుసగా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు మహేష్బాబు కొట్టడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని మహేష్ మంచి కసి మీద ఉన్నాడు. ఇటువంటి తరుణంలో ఈ సినిమాలో విజయశాంతి నటించడంతో ఈ సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు రాజకీయాలలో కీలకంగా వ్యవహరించిన విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్న విజయశాంతి ఫోటో ఒకటి డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో విడుదల చేసి సంచలన పోస్ట్ పెట్టారు.


డైరెక్టర్ అనిల్ రావిపూడి షూటింగ్ లో పాల్గొన్న విజయశాంతి ఫొటోని ప్రస్తావిస్తూ.. 13 ఏళ్ల తరువాత విజయశాంతి మేకప్ వేసుకున్నట్లు చెబుతూ.. ఈ 13 ఏళ్లలో ఆమెలో ఏ మాత్రం మార్పు రాలేదని, సేమ్ డిసిప్లేన్ - సేమ్ ఆటిట్యూడ్ అని పేర్కొన్నారు. అలాగే ఆమె చైతన్యంలో కూడా ఎలాంటి తేడా కనిపించలేదని సరిలేరు నీకెవ్వరు టీమ్ లోకి ఆమెను ఆనందంగా ఆహ్వానిస్తున్నట్లు దర్శకుడు తెలియజేశాడు.


దీంతో విజయశాంతి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా మహేష్ బాబు అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఇదే క్రమంలో సినిమాలో ఆమెకు సంబంధించిన స్టిల్ ఒకటి విడుదల చేయాలని మహేష్ బాబు అభిమానులు సినిమా యూనిట్ పై ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ మొదలయ్యింది డిసెంబర్ లోగా సినిమాని పూర్తి చేసి ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: