తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 3 ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం షో లో వాతావరణం ఇంటి సభ్యుల మధ్య చాలా ఉత్కంఠ పోరుకు దారి తీసింది. గ్రూపులు గ్రూపులుగా హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు చాలా తారాస్థాయిలో ఉన్నాయి. మరోపక్క బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తున్న టస్కులు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్నయి. ఇటువంటి ఈ నేపథ్యంలో హౌస్ లో మొట్టమొదటి ఇంటి సభ్యురాలిగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నటి హేమ స్థానంలో వైల్డ్ కార్డు రూపంలో టాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.


దాదాపు రెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన తమన్నా తాజాగా ఇటీవల మూడవ వారంలో తమన్నా నామినేషన్ కి ఎంపికయి ఎలిమినేట్ అయింది. ఈ సందర్భంగా బయటికొచ్చిన తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. బయటకు వచ్చిన తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హౌస్ లో చాలా రోజులు ఎంజాయ్ చేశానని తెలిపింది. తాను ఎలిమినేట్ కావడానికి కారణం ప్రజలు తనని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే అని తమన్నా తెలిపింది.


బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో. లోపలి ఎవరైనా గేమ్ ఆడేందుకే వెళతారు. రవి కృష్ణ విషయంలో తన ప్రవర్తన గేమ్ లో భాగమే అని తమన్నా తెలిపింది. కానీ అందరూ అది అర్థం చేసుకోకుండా నా క్యారెక్టర్ ని తప్పుబట్టారు. అది సరికాదు. గేమ్ లో అలా ప్రవర్తించినంత మాత్రాన నేను చెడ్డదాన్ని ఐపోతానా అని తమన్నా ప్రశ్నించింది. హౌస్ లో ముందు నుండి గ్రూపులు ఉన్నాయని తెలిపింది. అయితే హౌస్ లో అందరికంటే బాబా భాస్కర్, శ్రీముఖి అంటే తనకు ఇష్టమని తమన్నా చెప్పుకొచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: