బుల్లితెర మీద తన అందంతో ప్రేక్షకుల మతులు పోగొట్టే యాంకర్ అనసూయ వెండితెర మీద కూడా మెరుస్తుంది. జబర్దస్త్ ద్వారా ఈ అమ్మడు సాధించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే,అప్పుడప్పుడు వెండితెర మీద కూడా మెరుస్తుంది. క్షణం సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెర మీద కనిపించిన అనసూయ, రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా మంచి పేరు సంపాదించింది.


అయితే ఇటీవల అనసూయ లీడ్ రోల్ లో నటించిన "కథనం" మూవీ ప్రేక్షకులు ముందుకి వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ సినిమాకు రాలేదనే చెప్పాలి. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఇది వరకు కూడా ఆమె వేసుకునే డ్రెస్ మీదా, మాట్లాడే తీరు మీద విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె మీద ఇలాంటి ట్రోలింగ్స్ ఎందుకు వస్తున్నాయని అడగగా ఆమె ఇలా సమాధానం చెప్పింది.


నేను చాలా ట్రోల్స్ ఫేస్ చేశాను. ఈ విషయంలో నాకంటూ ఒక అండర్ స్టాండింగ్ వచ్చేసింది. నేను ఇపుడు ఏం మాట్లాడినా వేరే వాళ్లను ఉద్దేశించి కాదు. అలాగే నేను తెలుగు అమ్మాయిని అవడం, అందరిలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండటం, పదే పదే  హెడ్ లైన్స్ లోకి రావడం, లైమ్ లైట్లో ఉండటం, మనపై ఎక్కువ ఫోకస్  పడేలా చేయడం వల్లే ఇవన్నీ ప్రాబ్లమ్స్. నాలాంటి జీవితమే మరొకరికి ఉంటే  ఆమెని ఎంతో సపోర్ట్ చేసి ఉండేవారు. కేవలం నేను తెలుగు అమ్మాయిని అవడం మూలాన ఇదంతా జరుగుతుంది.


ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ లేరని అంటారు. నిజానికి తెలుగు కుటుంబాల్లో ఎంతో మంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు. కానీ వారిని ఇంట్లోనే తొక్కేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ల భయం కూడా ఉంది.
ఒక అమ్మాయి ఏదైనా చేస్తా అంటే ఇండస్ట్రీ అలాంటిది అని చెప్పేయకూడదు. ప్రపంచం అలా ఉందమ్మా.. నువ్వు బ్రతకనేర్వాలి అని చెప్పాలి. కానీ అవేమీ చెప్పకుండా ఇండస్ట్రీకి వద్దు అంటున్నారు. ఆ స్ట్రగుల్ ఏమిటో ఫేస్ చేసిన తర్వాత డిసైడ్ అవ్వు అని మాత్రం ఎవరూ చెప్పడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: