ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ టబు, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్ ఇతర క్యారెక్టర్స్ లో నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ఇటీవల మహర్షితో సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న భామ పూజా హెగ్డే హీరోయిన్ గా జోడి కడుతోంది. గతంలో డీజే సినిమాలో బన్నీతో జోడి కట్టిన పూజ, మరొకసారి ఆయన సరసన ఈ సినిమాలో నటిస్తోంది. 

ఇకపోతే మంచి కమర్షియల్ అంశాలతో ఆకట్టుకునే కథ, కథనాలు, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కు కూడా పెద్ద పీట వేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది. బన్నీ ఒక విభిన్నమైన క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ని స్వతంత్ర దినోత్సవం రోజైన ఈనెల 15న రివీల్ చేయనున్నట్లు సినిమా యూనిట్ నిన్న ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా టైటిల్ విషయమై నేడు ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మంచి లవ్ మరియు ఎంటర్టైన్మెంట్ తో పాటు తండ్రి మరియు కొడుకులకు సంబందించిన ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందని, 

అలానే ఈ సినిమా టైటిల్ ని 'వైకుంఠపురంలో' గా ఫిక్స్ చేస్తినట్లు ఆ వార్త యొక్క సారాంశం. అయితే టైటిల్ 15న ప్రకటిస్తామని సినిమా యూనిట్ ఆల్రెడీ ప్రకటన విడుదల చేసింది కాబట్టి, ఇందులోని నిజానిజాలు ఏమిటనేది తెలిసేది అదే రోజున అని మనకు అర్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకు ఇదే టైటిల్ ని దాదాపుగా నిర్ణయించినట్లే అని చెప్తున్నారు కొందరు బన్నీ సన్నీహితులు. మరి ఇందులో నిజానిజాలు తేలాలంటే మరొక రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: