హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు నిఖిల్. హ్యాపీడేస్ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "స్వామిరారా" సినిమాతో మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. వరుసగా విజయాలు అందుకున్నాడు. విభిన్నమైన కథాంశాలు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే గత కొంత కాలంగా నిఖిల్ కి ఏదీ కలిసి రావట్లేదు.


ముఖ్యంగా అతను నటించిన "అర్జున్ సురవరం" ఎప్పుడు విడుదల అవుతుందో తెలియట్లేదు. ఈ సినిమా మొదలైనప్పటి నుండి అతని చుట్టూ వివాదాలు అల్లుకున్నాయి. సినిమా టైటిల్ దగ్గర నుండి మొదలయిన వివాదాలు ఇప్పుడు రిలీజ్ కి కూడా అడ్డు పడుతున్నాయి. ఈ సినిమా గురించి ఇంత వరకు ఏ విధమైన అప్డేట్ రాలేదు. విడుదల తేదీలని ఇప్పటికే చాలా సార్లు మార్చారు. ఆ సినిమా విషయం అటుంచితే, నిఖిల్ మరో చిత్రాన్ని కూడా స్టార్ట్ చేసాడు.


"శ్వాస" అనే టైటిల్ తో మరో చిత్రాన్ని మొదలు పెట్టి కొన్ని షూటింగ్ చేసి ఏవో కారణాల వల్ల షూటింగ్ ఆపేసారు. ఇక ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఈ విధమైన సంధిగ్దంలో ఉండగా కార్తికేయ దర్శకుడు చందూ మొండేటి కార్తికేయ కి సీక్వెల్ ప్లాన్ చేసాడు. ఆ చిత్రం ఎట్టకేలకు మొదలవడంతో నిఖిల్‌ ఇక మిగిలిన సినిమాలని పక్కన పెట్టేసాడనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. 


కార్తికేయ -౨ ర్తికేయ 2 ఇటు నిఖిల్‌తో పాటు అటు చందు మొండేటికి కూడా కీలకమే. వరుసగా రెండు విజయాలు సాధించిన చందు 'సవ్యసాచి' పరాజయంతో వెనుకబడిపోయాడు. ఆమధ్య అగ్ర హీరోలతో చేస్తాడని చెప్పుకున్నారు కానీ మళ్లీ తిరిగి తన తొలి హీరో దగ్గరికే వచ్చి ఆగాడు. కార్తికేయ ఎలాగయితే గుడి చుట్టూ వుండే మిస్టరీ ప్రధానంగా సాగుతుందో ఈ సీక్వెల్‌ని కూడా అలాగే విభిన్నమైన నేపథ్యంలో, సరికొత్త తారాగణంతో తెరకెక్కించబోతున్నారు. సాంకేతిక నిపుణులు ఎవరనే విషయం ఇంకా తెలిసి రాలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: