స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.


తన ప్రతి సినిమా విషయంలో ఎక్కువ సెంటిమెంట్స్ ఫాలో అయ్యే త్రివిక్రం ఈ సినిమాకు అదే రిపీట్ చేస్తున్నాడట. త్రివిక్రం సినిమాల్లో 'అ' తో మొదలైన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అతడు, అత్తారింటికి దారేది, అఆ, అరవింద సమేత ఇలా అన్ని సినిమాలు అతనికి మంచి హిట్ ఇచ్చాయి. అయితే అజ్ఞాతవాసి మాత్రం నిరాశపరచింది. 


ఇదిలాఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు కూడా 'అ' తో మొదలయ్యే టైటిల్ నే అనుకుంటున్నారట. ముందు ఈ సినిమాకు వైకుంఠపురంలో అని అనుకున్నారట. కాని అలా యాడ్ చేసి తన సెంటిమెంట్ ప్రూవ్ చేసుకున్నాడు త్రివిక్రం. అలా వైకుంఠపురంలో అంటూ బన్ని, త్రివిక్రం సినిమా వస్తుంది. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రం సినిమాల టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేస్తున్నారట. 


ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటుగా సుకుమార్ సినిమాను లైన్ లో పెడుతున్నాడు.. అంతేకాదు వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ మూవీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: