సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో ఇప్పటివరకు రెండు సినిమాలు పోకిరి మరియు బిజినెస్ మ్యాన్ రావడం జరిగింది. అందులో పోకిరి అప్పట్లో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ కాగా, బిజినెస్ మ్యాన్ సినిమా కూడా మంచి హిట్ ని సాధించడం జరిగింది. అయితే వారిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చి ఎన్నో ఏళ్ళు గడవడంతో, మహేష్ ఫ్యాన్స్ మరొక్కసారి పూరితో పని చేయాలని పలు రకాలుగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మహేష్ కు విజ్ఞప్తులు చేస్తూనే వస్తున్నారు. అదీకాక ఆ మధ్య, తన దగ్గర జనగణమణ అనే సినిమా కథ ఉందని, ఆ సినిమా కేవలం మహేష్ గారు మాత్రమే చేయగల పవర్ ఫుల్ సినిమా అని ఒక ఇంటర్వ్యూ లో పూరి చెప్పడం జరిగింది. 

దానితో ఆ సినిమా మహేష్ తో చేయాలని ఆయన ఫ్యాన్స్ పూరీని కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కోరడం జరిగింది. అయితే కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని పూరి, ఇటీవల రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తో మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. ఇక ఇటీవల పూరి మాట్లాడుతూ, తన దగ్గర ఉన్న జనగణమణ స్టోరీని మహేష్ గారితో చేద్దాం అని అనుకున్నప్పటికీ ఆయన తనను కలవడం లేదని, మహేష్ కేవలం హిట్స్ లో ఉన్నపుడు మాత్రమే తనను పిలుస్తారని, అందుకే తనకు మహేష్ కంటే ఆయన ఫ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమని పూరి షాకింగ్ గా చెప్పారు. దాని తరువాత కొద్దిరోజులపాటు మహేష్ ఫ్యాన్స్ పూరీని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఏకేయడం కూడా జరిగింది. ఇక ఇవన్నీ ముగిసాక, నిన్న సడన్ గా పూరి, 

తన నెక్స్ట్ సినిమాని మహేష్ బాబు అభిమాని అయిన విజయ్ దేవరకొండ తో ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. అంతేకాక పూరి తీయబోయేది మరేదో కథ కాదు, మహేష్ కోసం రాసుకున్న జనగణమణ సినిమా కథే అంటూ రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మహేష్ తనకు అవకాశం ఇవ్వని కారణంగానే ఆయన అభిమానితోనే ఆ సినిమా తీసి హిట్ కొట్టాలని పూరి కసిగా ఉన్నట్లు కూడా కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. మరి ప్రస్తుతం విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే పూరి నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: